Amit Shah: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం.. ఆవిర్భావ వేడుకల్లో హోంమంత్రి అమిత్ షా

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడారు. ఈ సందర్భంగా అమిత్ షా తెలంగాణ ప్రజలందరికీ శుభకాంక్షలు తెలిపారు.

Amit Shah: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాం.. ఆవిర్భావ వేడుకల్లో హోంమంత్రి అమిత్ షా
Amit Shah
Follow us

|

Updated on: Jun 02, 2022 | 8:13 PM

Amit Shah -Telangana Formation Day: భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వస్తుందని.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఏళ్ల పాటు ఉద్యమం జరిగిందని అమిత్ షా తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు కోసం యువకులు ప్రాణత్యాగం చేశారని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడారు. ఈ సందర్భంగా అమిత్ షా తెలంగాణ ప్రజలందరికీ శుభకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతిని దేశ ప్రజలందరికీ తెలిసిందని పేర్కొన్నారు. ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అమిత్ షా కిషన్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. తాను దేశంలోని అన్ని జిల్లాల్లో గడిపానని.. అంతా భిన్నంగా ఉన్నా ఐక్యంగా ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వమనే మంత్రం దేశమంతా కనిపిస్తుందన్నారు. తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ సమర్ధించి మద్దతు తెలిపిందని అమిత్ షా పేర్కొన్నారు. కాంగ్రెస్ తెలంగాణ డిమాండ్‌ను 2004 నుంచి 2014 వరకు పట్టించుకోలేదని.. ఓడిపోతామన్న భయంతో 2014లో ప్రకటించదని అమిత్ షా పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తామని.. దీనిలో భాగంగా భారీగా నిధులను కేటాయించామని హోంమంత్రి పేర్కొన్నారు. ఏ రాష్ట్రం పై కూడా సవతి ప్రేమను చూపలేదని అమిత్ షా పేర్కొన్నారు. మార్పును అందరూ గమనిస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా జరిగిన పలు పరిణామాల గురించి అమిత్ షా వివరించారు.

ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ఏర్పాటు జరిగి 8 ఏళ్లు అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న వేడుకలకు జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేంద్రహోంమంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరవ్వగా.. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, మీనాక్షిలేఖి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి