Sadhvi Prachi: భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటే..కానీ..వారిది తప్ప..సాధ్వి ప్రాచీ వివాదాస్పద వ్యాఖ్య..
భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటేనని...కానీ గోమాంసం తినేవారిది తప్ప అని విశ్వ హిందూ పరిషద్ నాయకురాలు సాధ్వి ప్రాచీ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఇండియన్స్ అందరి డీఎన్ఏ ఒక్కటేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల ముస్లిం రాష్ట్రీయ మంచ్ నిర్వహించిన సమావేశంలో వ్యాఖ్యానించారు.
భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటేనని…కానీ గోమాంసం తినేవారిది తప్ప అని విశ్వ హిందూ పరిషద్ నాయకురాలు సాధ్వి ప్రాచీ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఇండియన్స్ అందరి డీఎన్ఏ ఒక్కటేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల ముస్లిం రాష్ట్రీయ మంచ్ నిర్వహించిన సమావేశంలో వ్యాఖ్యానించారు. హిందూ-ముస్లిం మధ్య ఐక్యత అన్నదే ప్రధానమని కూడా ఆయన అన్నారు. అయితే ఆ వ్యాఖ్యలకు స్పందించిన సాధ్వి ప్రాచీ..ఇండియన్స్ డీఎన్ఏ విషయంలో ఈ తేడా ఉందన్నారు. శనివారం రాజస్థాన్ లోని దౌసాలో మీడియాతో మాట్లాడిన ఆమె.. దేశంలో జనాభా అదుపునకు కఠిన చట్టాలు అవసరమని అన్నారు. ఇద్దరికి మించి సంతానం ఉన్నవారికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు లభించకుండా చూడాలన్నారు. ఇద్దరికి మించి ఎక్కువమంది సంతానం ఉంటే దాన్ని శిక్షగా పరిగణించి ఈ విధమైన చర్యలు తీసుకోవాలన్నారు. అలాంటివారికి ఓటు హక్కు లేకుండా చూడాలని కూడా ఆమె సూచించారు. లవ్ జిహాద్ అంశాన్ని ప్రస్తావించిన ఆమె.. ఈ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని, బలవంతపు మత మార్పిడులను అడ్డుకోవాలని, మహిళలకు భద్రత కల్పించాలని కోరారు.
ఏ కారణం వల్లో గానీ టూ చైల్డ్ పాలసీ మెల్లగా ఊపందుకుంటోంది. యూపీ ప్రభుత్వం అప్పుడే కుటుంబ నియంత్రణ అంశాన్ని హైలైట్ చేస్తూ పాపులేషన్ కంట్రోల్ పేరిట ముసాయిదా బిల్లును రూపొందించింది. ఇద్దరు బిడ్డలు మించి సంతానం ఉన్నవారికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు దక్కవని అంటూ.. పరిమిత సంతానం గలవారికి ఎన్నో ప్రోత్సాహకాలను ఇందులో వివరించింది. అస్సాం ప్రభుత్వం కూడా టూ చైల్డ్ పాలసీని ప్రకటించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు క్రమంగా దీనిపై ఫోకస్ పెడుతున్నట్టు కనిపిస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి : ప్రకాష్ రాజ్ ట్వీట్ కు నరేష్ దిమ్మ తిరిగే రిప్లై..!రసవత్తరంగా మారిన ‘మా’ అధ్యక్ష పోటీ..:Prakash Raj VS Naresh Video.