Sadhvi Prachi: భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటే..కానీ..వారిది తప్ప..సాధ్వి ప్రాచీ వివాదాస్పద వ్యాఖ్య..

భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటేనని...కానీ గోమాంసం తినేవారిది తప్ప అని విశ్వ హిందూ పరిషద్ నాయకురాలు సాధ్వి ప్రాచీ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఇండియన్స్ అందరి డీఎన్ఏ ఒక్కటేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల ముస్లిం రాష్ట్రీయ మంచ్ నిర్వహించిన సమావేశంలో వ్యాఖ్యానించారు.

Sadhvi Prachi: భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటే..కానీ..వారిది తప్ప..సాధ్వి ప్రాచీ వివాదాస్పద వ్యాఖ్య..
All Indians Share Same Dna Except Those,says Sadhvi Prachi,sadhwi Prachi,indians,dna,cow Meat,two Child Policy,rss Chief Mohan Bhagawat,
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jul 10, 2021 | 9:19 PM

భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటేనని…కానీ గోమాంసం తినేవారిది తప్ప అని విశ్వ హిందూ పరిషద్ నాయకురాలు సాధ్వి ప్రాచీ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఇండియన్స్ అందరి డీఎన్ఏ ఒక్కటేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల ముస్లిం రాష్ట్రీయ మంచ్ నిర్వహించిన సమావేశంలో వ్యాఖ్యానించారు. హిందూ-ముస్లిం మధ్య ఐక్యత అన్నదే ప్రధానమని కూడా ఆయన అన్నారు. అయితే ఆ వ్యాఖ్యలకు స్పందించిన సాధ్వి ప్రాచీ..ఇండియన్స్ డీఎన్ఏ విషయంలో ఈ తేడా ఉందన్నారు. శనివారం రాజస్థాన్ లోని దౌసాలో మీడియాతో మాట్లాడిన ఆమె.. దేశంలో జనాభా అదుపునకు కఠిన చట్టాలు అవసరమని అన్నారు. ఇద్దరికి మించి సంతానం ఉన్నవారికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు లభించకుండా చూడాలన్నారు. ఇద్దరికి మించి ఎక్కువమంది సంతానం ఉంటే దాన్ని శిక్షగా పరిగణించి ఈ విధమైన చర్యలు తీసుకోవాలన్నారు. అలాంటివారికి ఓటు హక్కు లేకుండా చూడాలని కూడా ఆమె సూచించారు. లవ్ జిహాద్ అంశాన్ని ప్రస్తావించిన ఆమె.. ఈ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని, బలవంతపు మత మార్పిడులను అడ్డుకోవాలని, మహిళలకు భద్రత కల్పించాలని కోరారు.

ఏ కారణం వల్లో గానీ టూ చైల్డ్ పాలసీ మెల్లగా ఊపందుకుంటోంది. యూపీ ప్రభుత్వం అప్పుడే కుటుంబ నియంత్రణ అంశాన్ని హైలైట్ చేస్తూ పాపులేషన్ కంట్రోల్ పేరిట ముసాయిదా బిల్లును రూపొందించింది. ఇద్దరు బిడ్డలు మించి సంతానం ఉన్నవారికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు దక్కవని అంటూ.. పరిమిత సంతానం గలవారికి ఎన్నో ప్రోత్సాహకాలను ఇందులో వివరించింది. అస్సాం ప్రభుత్వం కూడా టూ చైల్డ్ పాలసీని ప్రకటించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు క్రమంగా దీనిపై ఫోకస్ పెడుతున్నట్టు కనిపిస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి  : ప్రకాష్ రాజ్ ట్వీట్ కు నరేష్ దిమ్మ తిరిగే రిప్లై..!రసవత్తరంగా మారిన ‘మా’ అధ్యక్ష పోటీ..:Prakash Raj VS Naresh Video.

 ఈ లిబర్టీ స్టాచ్యూను కొరుక్కు తినొచ్చు..!చాక్లెట్‌తో స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ తయారీ!వీడియో వైరల్..:Statue Of Liberty With Chocolate Video.

 ఇదేందబ్బా ఈ ట్రైన్ నేనెప్పుడూ చూడాలే..తల కిందలుగా వేలాడుతూ.. వెళ్తున్న ట్రైన్‌.!వైరల్ వీడియో:Skywalk Train video.

 తుపాకులు చేతపట్టిన వీధుల్లో హల్ చల్ చేస్తున్న ఈ మహిళలు..! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.వైరల్ వీడియో..:Women Carry Guns Video.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..