72 ఏళ్ల తర్వాత కలిసిన అన్నా చెల్లి..
అన్నా చెల్లెళ్ల ఆత్మీయానురాగాలు మరువలేనివి. అమ్మలోని మొదటి అక్షరం అ, నాన్నలోని చివరి అక్షరం న్న.. ఈ రెండు అక్షరాలను కలిపి అన్నగా పిలుచుకుంటాం. అంటే తల్లిదండ్రులిద్దరి ప్రేమను అన్నయ్యలోనే చూసుకుంటారు చెల్లెళ్లు. అందుకే ఏ పరిస్థితుల్లో అయినా చెల్లికి అండగా ఉండాలని..అలాగే అన్నయ్య చల్లగా ఉండాలంటూ రాఖీ కట్టడం మన సంప్రదాయం. ఎన్నేళ్లైనా ఆ ప్రేమానురాగాలు అలాగే ఉంటాయనడానికి రాజస్థాన్లో జరిగిన ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. 72ఏళ్ల క్రితం విడిపోయిన అన్నా చెల్లెళ్లు..ఇప్పుడు సోషల్ మీడియా […]
అన్నా చెల్లెళ్ల ఆత్మీయానురాగాలు మరువలేనివి. అమ్మలోని మొదటి అక్షరం అ, నాన్నలోని చివరి అక్షరం న్న.. ఈ రెండు అక్షరాలను కలిపి అన్నగా పిలుచుకుంటాం. అంటే తల్లిదండ్రులిద్దరి ప్రేమను అన్నయ్యలోనే చూసుకుంటారు చెల్లెళ్లు. అందుకే ఏ పరిస్థితుల్లో అయినా చెల్లికి అండగా ఉండాలని..అలాగే అన్నయ్య చల్లగా ఉండాలంటూ రాఖీ కట్టడం మన సంప్రదాయం. ఎన్నేళ్లైనా ఆ ప్రేమానురాగాలు అలాగే ఉంటాయనడానికి రాజస్థాన్లో జరిగిన ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. 72ఏళ్ల క్రితం విడిపోయిన అన్నా చెల్లెళ్లు..ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కలుసుకున్నారు.
రాజస్థాన్ రాయ్సింగ్ నగర్కు చెందిన రంజిత్ సింగ్, తన సోదరి చిన్నతనంలోనే తప్పిపోయారు. 1947లో జరిగిన కశ్మీర్ అల్లర్ల సమయంలో రంజిత్ తన కుటుంబసభ్యులతో కలిసి భారత్లో ఉండగా..నాలుగేళ్ల తన సోదరి పాకిస్తాన్కు వెళ్లిపోయింది. అప్పటినుంచి ఆమె ఆచూకీ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు కుటుంబసభ్యులు. కానీ ఫలితం లేకుండా పోయింది. చివరకు ఆమె వివరాలతో కూడిన ఓ వీడియోను తయారుచేసి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఎట్టకేలకు సోషల్ మీడియా చొరవతో తన చెల్లి గురించి ఆచూకీ లభించింది. 72ఏళ్ల తర్వాతఅన్నా చెల్లి వీడియో కాల్ మాట్లాడుకొని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు.
పాకిస్తాన్కు వెళ్లిన రంజిత్ సోదరి..సకీనాగా పేరు మార్చుకొని..ఓ షేక్ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం నలుగురు పిల్లలకు తల్లిగా జీవిస్తున్న చెల్లిని చూసి ఎంతో సంతోషంగా ఉందంటున్నారు రంజిత్. ఈ రెండు కుటుంబాలు త్వరలోనే కర్తార్పూర్ నడవాలో కలవనున్నాయి.