బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ ఇక లేరు..
బాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ దిగ్గజనటుడు రిషికపూర్ కన్నుముశారు.
బాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ దిగ్గజనటుడు రిషికపూర్ కన్నుముశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో భాదపడుతున్న రిషి కపూర్ బుధవారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రిషికపూర్ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. భార్య నీతూకపూర్, రిషికపూర్ సోదరుడు రణధీర్ కపూర్, రిషికపూర్ కుమారుడు రణబీర్ కపూర్ ఆసుపత్రి వద్దే ఉన్నారు. రిషి మరణ వార్త విని వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు.
1952 సెప్టెంబర్ 4 రిషి ముంబైలో జన్మించారు.. ప్రముఖ నటుడు రాజ్ కపూర్ కి రిషి రెండో కుమారుడు..మేరా నామ్ జోకర్ మూవీలో బాలనటుడిగా సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టిన రిషి బాబీ మూవీతో హీరోగా అరంగేట్రం చేశారు.. ఆయన అనేక హిట్ సినిమాల్లో నటించారు.. 1980లో సహ నటి రితూ సింగ్ ను ఆయన వివాహం చేసుకున్నారు.. రిషికి ఇద్దరు పిల్లలు. కుమారుడు యంగ్ హీరో రణబీర్ కపూర్, కుమార్తె రిథిమా .. కాగా రిషి మరణం పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.