ఎయిమ్స్ స్టాఫ్ పై దాడి కేసులో ఆప్ ఎమ్మెల్యేకు రెండేళ్ల జైలు శిక్ష, తప్పుడు కేసులో ఇరికించారని వ్యాఖ్య
ఢిల్లీ లోని ఎయిమ్స్ స్టాఫ్ పై దాడి కేసులో ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి కి ఢిల్లీ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో మేజిస్ట్రేట్ కోర్టు ఇఛ్చిన ఉత్తర్వులను ఈ కోర్టు సమర్థిస్తూ ఇది సబబేనని పేర్కొంది..
ఢిల్లీ లోని ఎయిమ్స్ స్టాఫ్ పై దాడి కేసులో ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి కి ఢిల్లీ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో మేజిస్ట్రేట్ కోర్టు ఇఛ్చిన ఉత్తర్వులను ఈ కోర్టు సమర్థిస్తూ ఇది సబబేనని పేర్కొంది. ఆయన దాఖలు చేసుకున్న అప్పీలును కూడా కోర్టు పాక్షికంగా కొట్టివేసింది. కోర్టు తీర్పు అనంతరం ఆయనను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కాగా ఇది తప్పుడు కేసని, సెషన్స్ కోర్టు నుంచి న్యాయం పొందడంలో తాను విఫలమయ్యాయని, ప్రజల హక్కుల కోసంపోరాడిన తనను జైలుకు తీసుకువెళ్తున్నారని సోమనాథ్ భారతి ట్వీట్ చేశారు.గత జనవరిలో ఈయనకు సెషన్స్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తు తీర్పునిచ్చింది. అయితే హైకోర్టులో అప్పీలు దాఖలు చేసుకునేందుకు వీలుగా ఆయనకు బెయిల్ లభించింది. కానీ తాజాగా ఢిల్లీ కోర్టు…. దిగువ కోర్టుతీర్పును సమర్థించింది.
2016 సెప్టెంబరు 9 న సోమనాథ్ భారతి.. సుమారు 300 మంది సహచరులతో వెళ్లి ఎయిమ్స్ స్టాఫ్ పై దాడి చేశారని, ఎయిమ్స్ ప్రహరీ గోడను ఓ జేసీబీ ఆపరేటర్ తో కూల్చి వేయించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఎయిమ్స్ చీఫ్ సెక్యూరిటీ అధికారి రావత్ ఇఛ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆయన మీద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. ఈ కేసులో తనకు న్యాయం జరుగుతుందని ఆశించిన సోమనాథ్ భారతికి చివరకు నిరాశే మిగిలింది. ఐదేళ్ల కిందట జరిగిన ఈ కేసు ఇలా పరిసమాప్తమైంది.
మరిన్ని చదవండి ఇక్కడ :సూపర్ మార్కెట్ లో చిలిపిదొంగ..పట్టపగలు అందరూ చూస్తుండగానే దొంగతనం..వైరల్ అవుతున్న వీడియో..:Bird thief video.