Jammu Kashmir: కశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలోకి పడిపోయిన కారు.. ఎనిమిది మంది దుర్మరణం
మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. కాగా పోలీసులు స్థానికుల సాయంతో రెస్కూ ఆపరేషన్ చేపట్టారు. మృతదేహాలను లోయ నుంచి వెలికి తీశారు. 800 అడుగుల లోతు కావడం, దీనికి తోడు ప్రమాదానికి గురైన ప్రాంతం అత్యధిక భాగం పర్వతమయం కావడంతో మృతదేహాలను వెలికి తీయడానికి చాలాసేపు పట్టింది.
జమ్మూ కశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతోన్న ఓ టాటాసుమో అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. కిష్ట్వార్ జిల్లాలో మర్వా ప్రాంతం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. అతి వేగంగా వెళుతున్న సుమో అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో కారులో ఉన్న ఎనిమిది మంది మృత్యువాతపడ్డారని వారు పేర్కొన్నారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. కాగా పోలీసులు స్థానికుల సాయంతో రెస్కూ ఆపరేషన్ చేపట్టారు. మృతదేహాలను లోయ నుంచి వెలికి తీశారు. 800 అడుగుల లోతు కావడం, దీనికి తోడు ప్రమాదానికి గురైన ప్రాంతం అత్యధిక భాగం పర్వతమయం కావడంతో మృతదేహాలను వెలికి తీయడానికి చాలాసేపు పట్టిందిని కశ్మీర్ పోలీసులు తెలిపారు.
కాగా మృతుల్లో ఏడుగురు మర్వా ప్రాంతానికి చెందినవారని పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..