Earthquake: రాజస్థాన్లోని బికనేర్లో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..
Earthquake in Bikaner: రాజస్థాన్లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని బికనేర్ నగరంలో ఈ రోజు ఉదయం 8.01 గంటలకు..
Earthquake in Bikaner: రాజస్థాన్లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని బికనేర్ నగరంలో ఈ రోజు ఉదయం 8.01 గంటలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని తెలిపింది. ఈ భూప్రకంపనలతో బికనేర్ నగర ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. ప్రజలంతా ఇళ్లల్లోనుంచి బయటకు పరుగులు తీశారు. ఇటీవల కాలంలో ఉత్తర భారతదేశంలో భూకంపాలు తరచూ సంభవిస్తున్నాయి. కాగా.. గతంలోనూ రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్లో భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ రోజు ఉదయం సంభవించిన భూకంపం రాజస్థాన్ బికనేర్ నుంచి వాయువ్య దిశలో 420 కిలోమీటర్ల పరిధిలో ఏర్పడినట్లు ఎన్సీఎస్ పేర్కొంది.
Also Read: