కొనసాగుతున్న ఉగ్రవేట.. అనంత్నాగ్లో ముగ్గురు హతం..
జమ్ముకశ్మీర్ లోయలో ఉగ్రవేట కొనసాగుతోంది. ఈ ఏడాది ఇప్పటికే వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. దక్షిణ కశ్మీర్లోని పలు ప్రాంతంలో ఉగ్రవాదుల్ని పూర్తిగా ఏరిపారేసింది భారత సైన్యం.
జమ్ముకశ్మీర్ లోయలో ఉగ్రవేట కొనసాగుతోంది. ఈ ఏడాది ఇప్పటికే వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. దక్షిణ కశ్మీర్లోని పలు ప్రాంతంలో ఉగ్రవాదుల్ని పూర్తిగా ఏరిపారేసింది భారత సైన్యం. ఇక గత మార్చి నెలలో లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి లోయలో నిత్యం ఎక్కడో ఓ చోట ఉగ్రవాదుల కదలికలు బయటపడుతూనే ఉన్నాయి. అంతేకాదు.. దేశంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తుండగా.. వారి ప్లాన్లకు ఎప్పటికప్పడు చెక్ పెడుతోంది సైన్యం. తాజాగా సోమవారం తెల్లవారు జామున అనంత్నాగ్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఖుల్చోహర్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారం అందడంతో.. జమ్ముకశ్మీర్ పోలీసులు, సీఆర్మీపీఎఫ్ సిబ్బంది గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో వీరిని గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఎదురు కాల్పులు చేపట్టారు. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఈ ఎన్కౌంటర్లో గంటలోపే ముగ్గురు ఉగ్రవాదుల్ని చంపేసినట్లు అధికారులు వెల్లడించారు. మరికొంత మంది ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు తెలుస్తోందని.. గాలింపు కొనసాగుతున్నట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.