బ్రేకింగ్.. అసోంలో భూకంపం
అసోంలో భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారు జామున 5.26 గంటలకు అసోం రాష్ట్రంలోని సోనిట్పూర్ ప్రాంతంలో భూ ప్రంకంపనలు సంభవించాయి. రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 3.5గా..
అసోంలో భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారు జామున 5.26 గంటలకు అసోం రాష్ట్రంలోని సోనిట్పూర్ ప్రాంతంలో భూ ప్రంకంపనలు సంభవించాయి. రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 3.5గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూకంప తీవ్రత స్వల్పంగా ఉండటంతో.. ఎలాంటి నష్టం వాటిళ్లలేదు.
కాగా, గత కొద్ది రోజులుగా నిత్యం ఎక్కడ ఓ చోట వరుస భూకంపాలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు.. జమ్ముకశ్మీర్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రాలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూకంపాలు సంభవిస్తున్నాయి. శుక్రవారం నాడు రాజస్థాన్లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.
An earthquake of magnitude 3.5 occurred in Sonitpur, Assam at 5:26 am today: National Center for Seismology pic.twitter.com/eSgmSX3GT7
— ANI (@ANI) August 8, 2020
Read More :
కర్ణాటకలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు మహారాష్ట్రలో తగ్గని కేసులు.. మళ్లీ 10వేలకు పైగానే