Ayodhya: పాఠాలు చెప్పే స్టూడెంట్తో టీచర్ అఫైర్.. అతడు వద్దన్నా వినలేదు.. చివరకు ఊహించని విధంగా..
ఉత్తర్ప్రదేశ్ అయోధ్యలో ఓ మైనర్ విద్యార్థి.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని హత్య చేశాడు. గర్భవతి అయిన టీచర్.. ఇంట్లో ఒంటరిగా ఉండగా దారుణంగా చంపేశాడు. అందుకు కారణం తెలిస్తే షాక్ తింటారు.
Uttar Pradesh: ఉత్తర్ప్రదేశ్ అయోధ్య(Ayodhya)లో ఓ ప్రభుత్వ పాఠశాల టీచర్ మర్డర్ కేసు విచారిస్తున్న పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. ఆమె పాఠాలు చెప్పే 17ఏళ్ల మైనర్ విద్యార్థే.. ఈ హత్యకు కారకుడిగా గుర్తించారు. అందుకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు చెప్పడం స్థానికంగా చర్చనీయాశంమైంది. గర్భవతి అయిన 30 ఏళ్ల టీచర్.. అయోధ్య కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని తన ఇంట్లో జూన్ 1న ఒంటరిగా ఉండగా ఆ విద్యార్థి కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. కాగా వారిద్దరు ఒకే ఏరియాలో నివాసముండేవారు. ఈ క్రమంలోనే వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. కొన్ని నెలల పాటు ఇల్లీగల్ రిలేషన్(extramarital affair)నడిచింది. ఈ విషయం బయట తెలిస్తే.. తన పరువు పోతుందని భావించిన ఆ యువకుడు.. అక్రమ సంబంధాన్ని ఇక్కడితో ఆపేద్దామని టీచర్కు చెప్పాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని అతడు డిసైడ్ అయ్యాడు. ఎవరు లేని సమయంలో ఆమె ఇంట్లోకి ప్రవేశించి.. దారుణంగా చంపేశాడు. దీనిని దోపీడీగా పక్కదారి పట్టించేందుకు ఇంట్లో నుంచి విలువైన వస్తువులు దొంగిలించాడు. టీచర్ గదిలోని లాకర్ను బద్దలు కొట్టి.. రూ. 50వేలు, ఇతర విలువైన వస్తువులను దోచుకెళ్లాడు. కానీ పోలీసుల దర్యాప్తులో దొరికిపోయాడు. సదరు టీచర్తో 2 ఏళ్లుగా అక్రమ సంబంధం ఉన్నట్లు ఆ టీనేజర్ ఒప్పుకున్నాడు. నిందితుడిని జువనైల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. హత్య కేసును చేధించినందుకు డీఐజీ ఏకే సింగ్, ఎస్ఎస్పీ శైలేష్ పాండేలకు స్థానిక ఉపాధ్యాయ సంఘం కృతజ్ఞతలు తెలిపింది. (Source)
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి