వరద బీభత్సం.. కజిరంగా పార్కులో 129 జంతువులు మృతి..
అసోంలో వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. భారీ వదరల కారణంగా ఎన్నో గ్రామాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. దాదాపు వంద మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వేల మంది పునరావాస కేంద్రాల్లో..
అసోంలో వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. భారీ వదరల కారణంగా ఎన్నో గ్రామాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. దాదాపు వంద మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వేల మంది పునరావాస కేంద్రాల్లో బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. అంతేకాదు.. వరదల దాటికి ఎన్నో మూగ జీవాలు ప్రాణాలు కోల్పోయాయి. ఇక ఎన్నో రకాల జంతువులకు కేంద్రంగా ఉన్న కజిరంగా జాతీయ పార్క్లో కూడా వరదల దాటికి ఎన్నో మూగజీవులు ప్రాణాలు విడిచాయి. ఈ ఘటనపై అసోం ప్రభుత్వం కూడా స్పందించింది. ఇప్పటి వరకు పార్కులో దాదాపు 129 జంతువులు ప్రాణాలు విడిచినట్లు తెలిపారు. వీటిలో 14 ఖడ్గమృగాలు, 5 అడవి బర్రెలు, 8 అడవి పందులు, 2 చిత్తడి జింకలు, 95 చుక్కల జింకలు, ఒక సంబర్, ఒక పైతాన్ ఉన్నాయని అసో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.