టీడీపీకి మద్దతుగా.. ఏపీకి క్యూ కట్టిన జాతీయ నేతలు

ఏపీకి జాతీయ నేతలు క్యూ కట్టారు. ఎన్నికల ప్రచారంలోకి టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసేందుకు పలు రాష్ట్రాలకు చెందిన అగ్రనేతలంతా రానున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్ధుల్లా చేరుకున్నారు. ఇవాళ్టి నుంచి ఆయన టీడీపీకి మద్దతుగా ప్రచారం చేస్తారు. చంద్రబాబుకు మద్దతుగా రోడ్ షోల్లోనూ, బహిరంగ సభల్లోనూ పాల్గొననున్నారు. జాతీయ నేతల రాకతో ఏపీలో ఎన్నికల హీట్ మరింత పెరిగింది. అలాగే.. టీడీపీకి మద్దతుగా దేవెగౌడ, మమతాబెనర్జీ, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, […]

టీడీపీకి మద్దతుగా.. ఏపీకి క్యూ కట్టిన జాతీయ నేతలు
Follow us

| Edited By:

Updated on: Mar 26, 2019 | 10:13 AM

ఏపీకి జాతీయ నేతలు క్యూ కట్టారు. ఎన్నికల ప్రచారంలోకి టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసేందుకు పలు రాష్ట్రాలకు చెందిన అగ్రనేతలంతా రానున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్ధుల్లా చేరుకున్నారు. ఇవాళ్టి నుంచి ఆయన టీడీపీకి మద్దతుగా ప్రచారం చేస్తారు. చంద్రబాబుకు మద్దతుగా రోడ్ షోల్లోనూ, బహిరంగ సభల్లోనూ పాల్గొననున్నారు. జాతీయ నేతల రాకతో ఏపీలో ఎన్నికల హీట్ మరింత పెరిగింది.

అలాగే.. టీడీపీకి మద్దతుగా దేవెగౌడ, మమతాబెనర్జీ, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్, అరుణ్ శౌరి లాంటి నేతలు ప్రసంగించనున్నారు. వీరి రాకతో ఏపీ టీడీపీలో మరింత జోష్ పెరిగింది. సోమవారం జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అమరావతి చేరుకున్నారు. ఆయన ఇవాళ్టి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కర్నూలుతో పాటు నంద్యాల, అవనిగడ్డ, పత్తికొండ, కడపల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు.