మార్స్ మిషన్కు డిమాండ్.. పది రోజుల్లో మూడు ప్రయోగాలు..!
ఆధునిక సాంకేతిక ప్రపంచంలో.. అంగారకుడిపై ఏముందో తెలుసుకోవాలన్న ఆసక్తి రోజురోజుకు ఎక్కువైపోతోంది. భారత్ ఇప్పటికే ‘మంగళయాన్’ పేరుతో మార్స్ మిషన్ చేపట్టగా, ఈ నెల 20న యూఏఈ కూడా
ఆధునిక సాంకేతిక ప్రపంచంలో.. అంగారకుడిపై ఏముందో తెలుసుకోవాలన్న ఆసక్తి రోజురోజుకు ఎక్కువైపోతోంది. భారత్ ఇప్పటికే ‘మంగళయాన్’ పేరుతో మార్స్ మిషన్ చేపట్టగా, ఈ నెల 20న యూఏఈ కూడా అంగారకుడిపైకి రోవర్, ఆర్బిటర్ను పంపింది. ఏడు నెలల ప్రయాణం తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అది మార్స్ కక్ష్యలోకి చేరుకుంటుంది. ఈ ప్రయోగం జరిగిన మూడు రోజుల తర్వాత చైనా కూడా అంగారకుడిపైకి రోవర్ను పంపింది. ‘తియాన్వెన్-1’గా పిలిచే దీనిని లాంగ్మార్చ్ 5 రాకెట్ ద్వారా నింగిలోకి పంపింది.
ఇప్పుడు అమెరికాకు చెందిన ‘నాసా’ కూడా మార్స్ పైకి అతిపెద్ద రోవర్ను పంపింది. కెమెరాలు, మైక్రోఫోన్లు, డ్రిల్స్, లేజర్లు వంటి వాటితో కారంత పరిమాణంలో రూపొందించిన ఈ రోవర్ను అట్లాస్ ‘V’ రాకెట్ ద్వారా నేడు విజయవంతంగా ప్రయోగించింది. ప్రపంచంలో ఈ సమ్మర్లో ఇది మూడోది, చివరి మార్స్ ప్రయోగం. చైనా, యూఏఈ, అమెరికా మిషన్లు ఏడు నెలలు, 300 మిలియన్ మైళ్లు (480 మిలియన్ కిలోమీటర్లు) ప్రయాణించిన తర్వాత రెడ్ ప్లానెట్ను చేరుకుంటాయి.