పీవోకే సొంతానికి మోదీ నయా ప్లాన్.?

దాయాది పాకిస్థాన్‌తో చర్చలకంటే యుద్ధమే కరెక్ట్ అనే దిశగా మోదీ సర్కార్ ఒక్కో అడుగు వేస్తున్నట్లు సమాచారం. గత పాలకుల చేతకానితనం వల్ల ఇప్పటివరకు ఆత్మరక్షణలో పడుతూ వచ్చిన ఇండియా.. బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత మోదీ పుణ్యమా అని పాకిస్థాన్‌కు షాకుల మీద షాకులు ఇస్తోంది. ఇప్పటికే ఆర్టికల్ 370ని రద్దు చేసిన మోదీ ప్రభుత్వం.. పీవోకేను సొంతం చేసుకోవడానికి నయా ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పాక్ ఆక్రమించిన పీవోకేను భారత్ సొంతం […]

పీవోకే సొంతానికి మోదీ నయా ప్లాన్.?
Follow us

|

Updated on: Oct 09, 2019 | 2:19 AM

దాయాది పాకిస్థాన్‌తో చర్చలకంటే యుద్ధమే కరెక్ట్ అనే దిశగా మోదీ సర్కార్ ఒక్కో అడుగు వేస్తున్నట్లు సమాచారం. గత పాలకుల చేతకానితనం వల్ల ఇప్పటివరకు ఆత్మరక్షణలో పడుతూ వచ్చిన ఇండియా.. బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత మోదీ పుణ్యమా అని పాకిస్థాన్‌కు షాకుల మీద షాకులు ఇస్తోంది. ఇప్పటికే ఆర్టికల్ 370ని రద్దు చేసిన మోదీ ప్రభుత్వం.. పీవోకేను సొంతం చేసుకోవడానికి నయా ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

పాక్ ఆక్రమించిన పీవోకేను భారత్ సొంతం చేసుకుంటుందని.. త్వరలోనే భారత త్రివర్ణ పతాకం అక్కడ ఎగురుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు  మొదలుగుని ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, ఆర్మీ చీఫ్ తదితరులు వరుసగా ప్రకటనలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. గతానికి భిన్నంగా భారత్ తీరుతో పాక్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది. కశ్మీర్ విషయంపై నోరు మెదపడం అటుంచి.. తాము ఆక్రమించిన ముజఫర్ నగర్‌ను కాపాడుకోవడానికి ప్లాన్స్ సిద్ధం చేస్తోంది.

పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే.. దానికి తగ్గట్టుగానే దాయాది దేశం ఊహించని విధంగా ఎదురుదాడి చేసేందుకు మోదీ సర్కారు సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే పాక్ ప్రస్తుతం డిఫెన్స్‌లో పడిందని సమాచారం. ఇక పీవోకేను సొంతం చేసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉన్నా.. సరైన తరుణం కోసం వేచి చూస్తోందన్న మాట వినిపిస్తోంది. పుల్వామా తరహాలో పాక్ ఏదైనా కవ్వింపు చర్యకు పాల్పడితే.. పీవోకేపై భారత్ దాడి చేసేందుకు సిద్ధంగా ఉందంటున్నారు. ఇందుకోసం అంతర్జాతీయ మద్దతును కూడా మోదీ సర్కారు కూడగడుతోందట.

ఇక పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని చెబుతున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ అంతర్జాతీయంగా చాలా విమర్శలు ఎదుర్కుంటోంది.. అంతేకాక ఆర్ధికంగా దారుణ పరిస్థితులు ఎదుర్కొంటోందని తెలుస్తోంది. యూరీ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పీవోకేలో ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్‌ను నిర్వహించటం తెలిసిందే. ఈ ఘటనకు పాక్ నుంచి సరైన ప్రతిస్పందన లేకపోవటంతో భారత్ మరింత ధైర్యాన్ని పుంజుకుందన్న మాట వినిపిస్తోంది.

గతంలో ఎప్పుడూ లేని విధంగా మోదీ సర్కారు పీవోకే‌ భారత అంతర్భాగమని వాదిస్తోంది. దానికి తగ్గట్టుగానే తాజాగా విదేశాంగ మంత్రి జై శంకర్ ఇటీవల మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే దీర్ఘకాలం అవసరమయ్యే ఆయుధాల కొనుగోళ్లను పక్కన పెట్టిన భారత్.. తక్షణం యుద్ధం వస్తే అవసరమయ్యే ఆయుధాల్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేయటం వెనుక అసలు విషయం.. పీవోకేను సొంతం చేసుకోవటమే అని తెలుస్తోంది.

హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది