జగన్పై ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన లోకేష్..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. సీఎం జగన్పై ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు.. మీడియా ప్రతినిధులపై తప్పుడు కేసులు పెడతారా..? మీకసలు సిగ్గుందా అంటూ ట్వీట్ చేశారు. మీరు ఇంతకు దిగజారుతారానుకోలేదన్నారు. విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టి పాఠశాల తరగతి గదులను ఆక్రమించే హక్కు.. ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారంటూ మండిపడ్డారు. పాఠశాలలో ఉన్న పరిస్థితిని.. బయటి సమాజానికి చూపించినందుకు మీడియా ప్రతినిధులపై నిర్భయ కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు. దీనిని […]
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. సీఎం జగన్పై ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు.. మీడియా ప్రతినిధులపై తప్పుడు కేసులు పెడతారా..? మీకసలు సిగ్గుందా అంటూ ట్వీట్ చేశారు. మీరు ఇంతకు దిగజారుతారానుకోలేదన్నారు.
విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టి పాఠశాల తరగతి గదులను ఆక్రమించే హక్కు.. ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారంటూ మండిపడ్డారు. పాఠశాలలో ఉన్న పరిస్థితిని.. బయటి సమాజానికి చూపించినందుకు మీడియా ప్రతినిధులపై నిర్భయ కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు. దీనిని బట్టి చూస్తే.. మీ 8 నెలల పాలన ఎంత చెత్తగా ఉందో అర్థమవుతుందంటూ మరో ట్వీట్ చేశారు. అంతేకాదు.. 2430 జీవో ద్వారా మీ నియంతృత్వ ధోరణిని మరోసారి చాటుకున్నారంటూ విమర్శలు గుప్పించారు.
.@ysjagan ఇంత దిగజారి పోతారని అనుకోలేదు. రైతుల ఉద్యమాన్ని అణిచివేయడానికి మీడియా ప్రతినిధుల పై తప్పుడు కేసులు పెట్టిస్తారా? సిగ్గుగా లేదా జగన్ గారు.(1/3)
— Lokesh Nara (@naralokesh) January 24, 2020
విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టి పాఠశాలను ఆక్రమించే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? తల్లిదండ్రులు ఆందోళన ప్రపంచానికి చూపిస్తే మీడియా ప్రతినిధుల పై నిర్భయ కేసు పెట్టారంటేనే మీ 8 నెలల పాలన ఎంత చెత్తగా ఉందో అర్థమైంది.(2/3)
— Lokesh Nara (@naralokesh) January 24, 2020
మీడియా స్వేచ్ఛని హరించిన నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు. 2430జిఓ ద్వారా మీ నియంతృత్వ ధోరణి బయటపెట్టారు. ఇప్పుడు మీడియా ప్రతినిధుల పై కేసులు ద్వారా మీ భయం బయటపడింది. జగన్ గారి పిచ్చి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను, వెంటనే ప్రతినిధుల పై పెట్టిన తప్పుడు కేసులు ఉపసంహరించుకోవాలి(3/3)
— Lokesh Nara (@naralokesh) January 24, 2020