యువనేతలతో నారా లోకేశ్ లంచ్ మీట్ ..గేమ్ ప్లాన్ ఇదే..!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్..పార్టీ యువనేతలతో హైదరాబాద్లోని తన నివాసంలో ఆదివారం లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు ఈ లంచ్ మీట్ సాగింది. ఈ కార్యక్రమంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్..పార్టీ యువనేతలతో హైదరాబాద్లోని తన నివాసంలో ఆదివారం లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు ఈ లంచ్ మీట్ సాగింది. ఈ కార్యక్రమంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సీఎం జగన్ సర్కార్ను ఇరకాటంలో పెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై యువ నాయకులతో చర్చించారట లోకేశ్. అధికార పార్టీకి బ్యాగ్రౌండ్లో కీలకంగా వ్యవహరిస్తోన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కట్టడి చేసేలా ప్రయత్నాలు ఉదృతం చేయమని లోకేశ్ యువనేతలకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. సోషల్ మీడియాలో ప్రజల వాణిని వినిపించడం, జిల్లా కార్యాక్రమాల్లో చురగ్గా పాల్గొమని లోకేశ్..యంగ్ లీడర్స్కు పిలుపునిచ్చారట.
ఈ లంచ్ మీటింగ్కి పరిటాల శ్రీరామ్, కరణం వెంకటేశ్, చింతకాయల విజయ్, కోడెల శివరామకృష్ణ, కింజారపు రామ్మోహన్నాయుడు, బొజ్జల సుధీర్, దేవినేని చంద్రశేఖర్, జేసీ వారసులు సహా రాష్ట్రవ్యాప్తంగా 30 మంది యువనేతలు హాజరయ్యారు. పలువురు యువనేతలు వారి సతీమణులతో సహా ఈ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ విందు సమావేశంలో కొద్దిసేపు చంద్రబాబు దంపతులు సైతం పాల్గొన్నారు. పార్టీ కోసం కష్టపడ్డవారికి భవిష్యత్లో మంచి అవకాశాలు ఉంటాయని, వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని లోకేశ్…యువ నేతలకు భరోసా ఇచ్చినట్టు తెలస్తోంది.