నంద్యాలలో విషాదం..ఎస్‌బీఐ ఉద్యోగి సజీవదహనం

క‌ర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కారులో మంట‌లు చెల‌రేగి స్టేట్ బ్యాంక్ ఉద్యోగి సజీవద‌హ‌నమ‌య్యారు. నంద్యాల మండ‌లం చాపిరేవుల టోల్‌ప్లాజా సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

నంద్యాలలో విషాదం..ఎస్‌బీఐ ఉద్యోగి సజీవదహనం
Follow us

| Edited By:

Updated on: Jul 29, 2020 | 10:02 AM

క‌ర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కారులో మంట‌లు చెల‌రేగి స్టేట్ బ్యాంక్ ఉద్యోగి సజీవద‌హ‌నమ‌య్యారు. నంద్యాల మండ‌లం చాపిరేవుల టోల్‌ప్లాజా సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఎస్‌బీఐ ఎంప్లాయ్ శివకుమార్‌ మరో ముగ్గురు మిత్రుల‌తో కలిసి హైదరాబాద్‌కు నుంచి నంద్యాలకు కారులో ప‌య‌న‌మ‌య్యారు. నంద్యాల ద‌గ్గ‌ర్లో ముందుగా వెళ్తున్న కంటైనర్‌ను వీరు ప్రయాణిస్తున్న కారు ప్ర‌మాద‌వశాత్తూ ఢీకొట్టింది. దీంతో కారు కంటైనర్‌లో ఇరుక్కుపోయింది. రాత్రి స‌మ‌యం కావ‌డంతో కంటైనర్‌ డ్రైవర్ ప్ర‌మాదాన్ని గ‌మ‌నించ‌క‌.. కారును సుమారు 3కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ క్రమంలో చాపిరేవుల టోల్‌ప్లాజా వద్ద కారులో మంటలు మొద‌ల‌య్యాయి. శివకుమార్‌ దివ్యాంగుడు అవ్వ‌డంతో కారులో నుంచి బయటకు రాలేక సజీవదహమయ్యాడు. మరో ముగ్గురు సేఫ్ గా బ‌య‌ట‌ప‌డ్డారు.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శివకుమార్‌ స్వస్థలం కర్నూలు జిల్లా నంద్యాల మండలం రైతునగరం. అత‌డు నంద్యాల ఎస్‌బీఐ బ్యాంకులో వ‌ర్క్ చేస్తున్నాడు.