అనిల్ను ట్రోల్ చేస్తున్న నందమూరి ఫ్యాన్స్…
‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు అనిల్ రావిపూడి తన మొదటి హీరో కళ్యాణ్ రామ్ గురించి మర్చిపోయిన సంగతి తెలిసిందే. దీనితో అతడు నందమూరి ఫ్యాన్స్కు టార్గెట్ అయ్యాడు. అయితే తర్వాతి రోజు ట్విట్టర్ వేదికగా సంజాయిషీ చెప్పుకున్నా.. అభిమానులు మాత్రం అతడ్ని ఇంకా ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ వేడుకతో చాలా భావోద్వేగానికి లోనయ్యాను. చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. నిజంగానే నా మొదటి హీరోను మర్చిపోయాను తప్పితే.. ఉద్దేశపూర్వకంగా మాత్రం […]
‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు అనిల్ రావిపూడి తన మొదటి హీరో కళ్యాణ్ రామ్ గురించి మర్చిపోయిన సంగతి తెలిసిందే. దీనితో అతడు నందమూరి ఫ్యాన్స్కు టార్గెట్ అయ్యాడు. అయితే తర్వాతి రోజు ట్విట్టర్ వేదికగా సంజాయిషీ చెప్పుకున్నా.. అభిమానులు మాత్రం అతడ్ని ఇంకా ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు.
‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ వేడుకతో చాలా భావోద్వేగానికి లోనయ్యాను. చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. నిజంగానే నా మొదటి హీరోను మర్చిపోయాను తప్పితే.. ఉద్దేశపూర్వకంగా మాత్రం కాదు. ‘ఎంత మంచివాడువురా’ టీమ్కు శుభాకాంక్షలు చెబుతున్నాను. సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని’ అనిల్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఇలా డైరెక్టర్ ట్వీట్ చేయడం వెనుక కూడా అసలు రీజన్ ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్కు స్పెషల్ గెస్ట్గా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి సరిలేరు నీకెవ్వరు మూవీ విజయం సాధించాలని చెప్పడమే కాకుండా సంక్రాంతికి విడుదలయ్యే ‘అల.. వైకుంఠపురములో’ కూడా సక్సెస్ కావాలని కోరుకున్నారు. అయితే అనిల్ మధ్యలో కలగజేసుకుని ఆయనకు రజినీకాంత్ ‘దర్బార్’ గురించి కూడా చెప్పడంతో.. చిరు ఆ పేరును కూడా ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ‘పటాస్’ సినిమాతో లైఫ్ ఇచ్చిన నందమూరి కళ్యాణ్రామ్ను ఎలా మర్చిపోతారంటూ ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలుపెట్టారు. అయితే దీనిపై క్షమాపణ కోరుతూ ట్వీట్ చేసినా కూడా.. అలాంటి పెద్ద ఈవెంట్లో మొదటి హీరో పేరును ప్రస్తావించకపోవడంతో నందమూరి ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.