నెయిల్ కట్టర్ మింగిన చిన్నారి.. జీజీహెచ్ వైద్యుల అరుదైన చికిత్స
ఏడు నెలల పాప నెయిల్ కట్టర్ మింగగా గుంటూరు జీజీహెచ్ వైద్యులు దాన్ని తొలగించి ఆ చిన్నారి ప్రాణాలను కాపాడారు. ఆ పసిబిడ్డకు ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన మౌర్య రాజు, లక్ష్మి దంపతులు ఇటీవల గుంటూరు జిల్లా వినుకొండకు వలస వచ్చారు. వారి ఏడు నెలల పాప రజని ఈ నెల 20వ తేదీ సాయంత్రం ఇంట్లో ఆడుకుంటూ నెయిల్ కట్టర్ను మింగేసింది. కుటుంబసభ్యులు బాలికను గుంటూరు గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. […]
ఏడు నెలల పాప నెయిల్ కట్టర్ మింగగా గుంటూరు జీజీహెచ్ వైద్యులు దాన్ని తొలగించి ఆ చిన్నారి ప్రాణాలను కాపాడారు. ఆ పసిబిడ్డకు ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన మౌర్య రాజు, లక్ష్మి దంపతులు ఇటీవల గుంటూరు జిల్లా వినుకొండకు వలస వచ్చారు. వారి ఏడు నెలల పాప రజని ఈ నెల 20వ తేదీ సాయంత్రం ఇంట్లో ఆడుకుంటూ నెయిల్ కట్టర్ను మింగేసింది. కుటుంబసభ్యులు బాలికను గుంటూరు గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. పిల్లల చికిత్స విభాగపు సీనియర్ వైద్యులు యశోధర పాపను పరీక్షించి, జీర్ణకోశ వ్యాధుల వైద్యురాలు కవిత దృష్టికి తీసుకెళ్లారు. ఎక్స్రే తీసి నెయిల్ కట్టర్ జీర్ణకోశంలో ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం ఎండో స్కోప్ సహాయంతో వైద్యురాలు కవిత నెయిల్ కట్టర్ను శిశువుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయవంతంగా తొలగించారు. పాప తల్లిదండ్రలు డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు.