మెడికల్ షాపులో మద్యం..! అనుమానం రాకుండా ఇలా..
దేశంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ అమల్లో ఉంది. దీంతో మద్యం షాపులు కూడా మూతపడ్డాయి. చుక్కదొరక్క మందుబాబులు అల్లాడిపోతున్నారు.
దేశంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ అమల్లో ఉంది. దీంతో మద్యం షాపులు కూడా మూతపడ్డాయి. చుక్కదొరక్క మందుబాబులు అల్లాడిపోతున్నారు. ఇదే అదునుగా కొందరు అక్రమార్కులు దొడ్డిదారుల్లో మద్యం అమ్మకాలు మొదలు పెట్టారు. అందుకోసం ఏకంగా ఓ వ్యాపారి మెడికల్ షాపులోనే దందా సాగిస్తున్నాడు.
వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని నాగ్పూర్లో గణేష్పేట్ ప్రాంతంలోని ఓ మెడికల్ షాపు యజమాని లాక్డౌన్ నిబంధనలను క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన మెడికల్ షాపులోనే అక్రమంగా మద్యం అమ్మకాలను మొదలుపెట్టాడు. టానిక్ సీసాల్లో విస్కీ, బ్రాందీ, సెలైన్ బాటిల్స్ జిన్ను, వోడ్కా నింపి రహస్యంగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాడు. అయితే పోలీసుకలుకు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. షాపుపై ఆకస్మీక తనిఖీ చెపట్టారు. మంచినీళ్ల బాటిళ్లలో బీర్ పోసి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు షాపు యజమాని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు.