కాళేశ్వరానికి ‘మన్మథుడి’ ప్రశంస
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నీటిని వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్పై సినీ నటుడు నాగార్జున సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ‘‘నీరే మనకు జీవనాధారం. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి […]
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నీటిని వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్పై సినీ నటుడు నాగార్జున సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
‘‘నీరే మనకు జీవనాధారం. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఆల్ ది బెస్ట్. మానవ ఇంజనీరింగ్ నైపుణ్యానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రతీక’’ అంటూ నాగార్జున ట్వీట్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్, తెలంగాణ సీఎంవోలకు ఆయన ట్యాగ్ చేశారు.
Water is life!! All the best for the inauguration of the largest lift irrigation project in the world!! #KaleshwaramProject a marvel of human engineering!!! @KTRTRS @TelanganaCMO
— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 21, 2019