ట్రైలర్ టాక్: ఏజ్ బార్ ‘మన్మథుడి’.. రొమాంటిక్ స్టోరీ!
అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చిత్రం ‘మన్మధుడు 2’. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్, సమంతా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్రెంచ్ సినిమాకు రీమేక్గా ఈ సినిమా రూపొందింది. వచ్చే నెల 9న విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్ను ఇవాళ విడుదల చేసింది చిత్ర యూనిట్. ట్రైలర్ విషయానికి వస్తే.. ఏజ్ బార్ బ్రహ్మచారి శామ్(నాగార్జున)కు మూడు నెలల్లో పెళ్లి చేయాలని అతని […]
అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చిత్రం ‘మన్మధుడు 2’. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్, సమంతా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్రెంచ్ సినిమాకు రీమేక్గా ఈ సినిమా రూపొందింది. వచ్చే నెల 9న విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్ను ఇవాళ విడుదల చేసింది చిత్ర యూనిట్.
ట్రైలర్ విషయానికి వస్తే.. ఏజ్ బార్ బ్రహ్మచారి శామ్(నాగార్జున)కు మూడు నెలల్లో పెళ్లి చేయాలని అతని తల్లి(లక్ష్మీ) డిసైడ్ చేస్తుంది. అప్పుడే తన జీవితంలోకి అందాల అవంతిక(రకుల్ ప్రీత్ సింగ్) అడుగు పెడుతుంది. ఇంట్లో వాళ్ళందరూ వెక్కిరిస్తున్నా.. అది పట్టించుకోకుండా అవంతికతో పరిచయం పెంచుకుంటాడు శామ్. మెల్లిగా అది ప్రేమగా మారుతుంది. అయితే పిల్లలు కనడం కోసం నా జీవితాన్ని నాశనం చేసుకోను అని సిద్ధాంతాన్నిపెట్టుకుని.. దాని కోసం పెళ్ళికి దూరంగా ఉన్న ఈ మన్మధుడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది కథాంశం.
కామెడీ, ఎమోషన్స్, రొమాన్స్, యాక్షన్ సన్నివేశాల మేళవింపుతో ట్రైలర్ను చక్కగా కట్ చేశారు. నాగార్జున మరోసారి ఏజ్ బార్ మన్మధుడిలా అదరగొట్టాడు. రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. రావు రమేష్, లక్ష్మీ, వెన్నెల కిషోర్ వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇకపోతే ట్రైలర్లో వినిపించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది.
ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ బట్టి సినిమాపై ఓ అంచనాకు రావచ్చు. అయితే ‘మన్మధుడు’ ఫస్ట్ మూవీకి తగినట్లు మాత్రం ఈ ట్రైలర్ ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఆగష్టు 9న రిలీజ్ కానుంది.