Bigg Boss 4: ప్రతి ముగ్గురిలో ఇద్దరు షోను చూస్తున్నారట

ఎన్నో అంచనాల మధ్య ఈసారి బిగ్‌బాస్ నాలుగో సీజన్‌ ప్రారంభం అయ్యింది. కరోనా నేపథ్యంలో ఈ సారి షో ఉంటుందా..? ఉండదా..?

Bigg Boss 4: ప్రతి ముగ్గురిలో ఇద్దరు షోను చూస్తున్నారట
Follow us

| Edited By:

Updated on: Sep 20, 2020 | 8:13 AM

Bigg Boss 4 Telugu: ఎన్నో అంచనాల మధ్య ఈసారి బిగ్‌బాస్ నాలుగో సీజన్‌ ప్రారంభం అయ్యింది. కరోనా నేపథ్యంలో ఈ సారి షో ఉంటుందా..? ఉండదా..? అన్న అనుమానాలు కొనసాగుతుండగా.. ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు అన్ని జాగ్రత్తలతో బిగ్‌బాస్‌ని ప్రారంభించారు నిర్వాహకులు. పెద్ద పెద్ద వారిని ఈ సీజన్‌కి తీసుకురాలేకపోయినప్పటికీ.. అందరికీ తెలిసిన వారిని ఇందులో భాగం చేశారు.

ఇక ఈ సీజన్‌ ప్రారంభమై రెండు వారాలు పూర్తి కాగా.. పలు కీలక విషయాలను వెల్లడించారు వ్యాఖ్యత నాగార్జున. బిగ్‌బాస్ 4 మరో హిస్టరీ క్రియేట్ చేసిందని నాగ్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ముగ్గురులో ఇద్దరు ఈ షోను చూస్తున్నారని నాగ్ అన్నారు. బిగ్ బాస్ హిస్టరీలోనే అత్యధిక రేటింగ్ ఈ సీజన్‌కి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాదు గతవారం కంటే రెండో వారంలో అత్యధిక ఓట్లు వచ్చాయని, రెండో వారంలో ఆరు కోట్ల ఓట్లు వచ్చాయని తెలిపారు. కాగా బిగ్‌బాస్ ప్రారంభం రోజు కూడా ఈ షోకు 18.6 రేటింగ్ వచ్చింది. గతంలో ఏ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌కు ఇంత రేటింగ్ రాకపోవడం విశేషం.

Read More:

Bigg Boss 4: గంగవ్వ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌

Bigg Boss 4: కరాటే కళ్యాణి ఔట్.. నెక్ట్స్‌ అతడే..!