వెకేషన్ పూర్తి చేసుకొని హైదరాబాద్ లో అడుగు పెట్టిన లవ్లీ కపుల్… మాల్దీవుల్లో భర్త బర్త్ డే సెలబ్రేట్ చేసిన సామ్ 

టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత వెకేషన్ ముగించుకొని హైదరాబాద్ లో అడుగుపెట్టారు. నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఈ జంట మాల్దీవులకు వెకేషన్ కు వెళ్లారు.

వెకేషన్ పూర్తి చేసుకొని హైదరాబాద్ లో అడుగు పెట్టిన లవ్లీ కపుల్... మాల్దీవుల్లో భర్త బర్త్ డే సెలబ్రేట్ చేసిన సామ్ 
Follow us

|

Updated on: Nov 30, 2020 | 3:08 PM

టాలీవుడ్ లవ్లీ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత వెకేషన్ ముగించుకొని హైదరాబాద్ లో అడుగుపెట్టారు. నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఈ జంట మాల్దీవులకు వెకేషన్ కు వెళ్లారు. అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తూ సమంత పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. 23 చైతన్య పుట్టిన రోజును మాల్దీవుల్లో ఘనంగా సెలబ్రేట్ చేసింది సామ్. ఇక ఈ జోడీ వెకేషన్ పూర్తి చేసుకొని హైదరాబాద్ కు వచ్చారు.

ఎయిర్ పోర్ట్ లో చైతన్య సమంత జంట బయటకు వస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఈ ఫొటోలో కూడా సమంత అందాలు ఆరబోసింది. వెకేషన్ తర్వాత ఎవరి సినిమాలతో వాళ్ళు తిరిగి బిజీ కానున్నారు. నాగచైతన్య చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తున్న’లవ్ స్టోరీ’ సినిమా షూటింగ్ ను ఇటీవలే పూర్తి చేసాడు చైతన్య. ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. తర్వాత మిగిలిన సినిమాలపై ఫోకస్ పెట్టనున్నాడు. అటు సామ్ సినిమాలు చేయకపోయినా టాక్ షోలతో బిజీగా కానుంది. ప్రస్తుతం సమంత ఆహా ప్లాట్ ఫామ్ లో స్యామ్ జామ్ అనే టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే చిరంజీవితో సహా ఇంకా చాలామంది సెలబ్రిటీలు టాక్ షోకి రానున్నారు.వీటితో పాటు పలు వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది ఈ అక్కినేని కోడలు.