ఆహారం, నీరు లేకుండా 76 ఏళ్ళు జీవించిన ఈ యోగి ఇక లేరు
76 సంవత్సరాలుగా ఆహారం గానీ, నీరు గానీ లేకుండా జీవించారని చెబుతున్న యోగి ప్రహ్లాద్ జానీ కన్ను మూశారు. ఆయన వయస్సు 90 ఏళ్ళు..
76 సంవత్సరాలుగా ఆహారం గానీ, నీరు గానీ లేకుండా జీవించారని చెబుతున్న యోగి ప్రహ్లాద్ జానీ కన్ను మూశారు. ఆయన వయస్సు 90 ఏళ్ళు. గుజరాత్ లోని తన సొంత గ్రామం చరదా లో ఆయన మంగళవారం పరమపదించారు. ఆయన భౌతిక కాయాన్ని బనస్కాంత జిల్లాలోని అంబాజీ ఆలయం వద్ద గల ఆశ్రమానికి తరలించారు. 2003 లోను, 2010 లోను శాస్త్రవేత్తలు ఆయన ఆరోగ్యాన్ని పరీక్షించారని, ఆహరం గానీ, నీరు గానీ లేకుండా గడుపుతున్నందుకు ఆశ్చర్యపోయారని యోగి శిష్యులు తెలిపారు. తన పద్నాలుగో యేటి నుంచే యోగి వీటిని మానివేశారట. అంబ భక్తుడినని చెప్పుకునే ఈయనను చున్రీవాలా మాతాజీ కూడా వ్యవహరించేవారు.