నేషనల్ హైవేపై నోట్ల కట్టల కలకలం
అనంతపురం జిల్లా రాయదుర్గం నేషనల్ హైవేపై స్థానికులకు భారీగా డబ్బు దొరికింది. రూ.10 లక్షల మేర రూ.500 నోట్లు దొరికినట్లు స్థానికుల సమాచారం.
అనంతపురం జిల్లా రాయదుర్గం నేషనల్ హైవేపై స్థానికులకు భారీగా డబ్బు దొరికింది. రూ.10 లక్షల మేర రూ.500 నోట్లు దొరికినట్లు స్థానికుల సమాచారం. వడ్రవన్నూరు శివారులో గుర్తుతెలియని వ్యక్తులు పడేసి వెళ్లినట్లు తెలుస్తోంది. బొమ్మకపల్లి, 74 ఉడేగోళం గ్రామస్తులు నోట్లు తీసుకున్నారని చెబుతున్నారు. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు, డబ్బు ఎవరు పడేశారు, ఎందుకు పడేసి ఉంటారనే కోణాల్లో ఆరా తీస్తున్నారు.
Also Read :
ఇంట్లో నిద్రపోతున్న ముగ్గురు చిన్నారులను కాటేసిన కట్లపాము