ఘనంగా మై హోం గ్రూప్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్

హైదరాబాద్ ఎన్‌కన్వెన్షన్ సెంటర్‌లో మై హోం గ్రూప్ న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మై హోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు.. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. 2019లో ప్రణాళిక బద్ధంగా పనిచేసి అనేక విజయాలు సాధించామన్నారు మై హోమ్స్ అధినేత. గత 40 ఏళ్ల కాలంలో ఎన్నో అనుభూతులను చూశామని.. సమయం చాలా విలువైనదని.. కష్టపడి పనిచేస్తే మరిన్ని లక్ష్యాలను సాధించగలుగుతామన్నారు. ప్రస్తుతం మై […]

ఘనంగా మై హోం గ్రూప్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 02, 2020 | 4:17 PM

హైదరాబాద్ ఎన్‌కన్వెన్షన్ సెంటర్‌లో మై హోం గ్రూప్ న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మై హోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు.. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. 2019లో ప్రణాళిక బద్ధంగా పనిచేసి అనేక విజయాలు సాధించామన్నారు మై హోమ్స్ అధినేత. గత 40 ఏళ్ల కాలంలో ఎన్నో అనుభూతులను చూశామని.. సమయం చాలా విలువైనదని.. కష్టపడి పనిచేస్తే మరిన్ని లక్ష్యాలను సాధించగలుగుతామన్నారు. ప్రస్తుతం మై హోం గ్రూప్ అనేక శాఖలుగా విస్తరించి విజయవంతంగా ముందుకెళ్తోందన్నారు. సంస్థ కోసం నిరంతరం కష్టపడే వారిని అభినందిస్తున్నానన్నారు రామేశ్వర్ రావు. తాజాగా మీడియాలో కూడా ప్రవేశించి మంచి ఫలితాలు సాధిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్య దేశంలో సవాళ్లు కూడా అదే స్థాయిలో ఉంటాయని.. 2020-30 దశాబ్దకాలం ఎంతో గొప్ప లక్ష్యాలు ముందున్నాయన్నారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కమిట్మెంట్ విజయానికి సాధనాలని.. అందుకు షార్ట్ కట్స్‌ను ఎంచుకోవద్దన్నారు. ఈ కార్యక్రమానికి టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్, టీవీ9 చానెల్ స్టాఫ్ హాజరయ్యారు.