మై హోం ఇండస్ట్రీస్కు అవార్డుల పంట..!
మై హోం ఇండస్ట్రీస్ రెండు విభాగాల్లో ప్రతిష్టాత్మక నేషనల్ సేఫ్టీ అవార్డులు కైవశం చేసుకుంది. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా సిమెంట్ గ్రైన్డింగ్ యూనిట్కు ఒక అవార్డ్, గడిచిన ఐదేళ్లలో ఎలాంటి ప్రమాదాలు లేకుండా కంపెనీని నిర్వహించినందుకు మరో అవార్డ్ మై హోమ్ గ్రూప్ని వరించింది. కేంద్ర కార్మిక శాఖా మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు మై హోం గ్రూప్ ఏజీఎం పి. సూర్యనారాయణ. యాజమాన్యం విధానాలు, సిబ్బంది కార్మికుల కృషితోనే ఈ […]
మై హోం ఇండస్ట్రీస్ రెండు విభాగాల్లో ప్రతిష్టాత్మక నేషనల్ సేఫ్టీ అవార్డులు కైవశం చేసుకుంది. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా సిమెంట్ గ్రైన్డింగ్ యూనిట్కు ఒక అవార్డ్, గడిచిన ఐదేళ్లలో ఎలాంటి ప్రమాదాలు లేకుండా కంపెనీని నిర్వహించినందుకు మరో అవార్డ్ మై హోమ్ గ్రూప్ని వరించింది. కేంద్ర కార్మిక శాఖా మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు మై హోం గ్రూప్ ఏజీఎం పి. సూర్యనారాయణ. యాజమాన్యం విధానాలు, సిబ్బంది కార్మికుల కృషితోనే ఈ ఘనత సొంతమైందని చెప్పారాయన. ఈ గ్రూప్ శ్రీ జూపల్లి రామేశ్వరరావు గారి నేతృత్వంలో ఎంతో అభివృద్ధి చెందుతోందన్నారు. సేఫ్టీ విషయంలో ఈ అవార్డుల ద్వారా తమ సత్తా ఏంటో నిరూపించుకున్నామన్నారు.