కేజ్రీవాల్ పై తీవ్ర ఆరోపణలు… ఖండించిన ఆప్ నేత
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో టికెట్ కోసం తన తండ్రి నుంచి కేజ్రీవాల్ ఆరు కోట్ల రూపాయలు తీసుకున్నారంటూ పశ్చిమ ఢిల్లీ ఆప్ అభ్యర్థి బల్బీర్ సింగ్ జాఖర్ కుమారుడు ఉదయ్ జాఖర్ చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. ఉదయ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో బల్బీర్ సింగ్ స్పందించారు. కుమారుడితో తాను చాలా తక్కువగా మాట్లాడతానని, అతడు ఆరోపిస్తున్న విషయమై తానెప్పుడూ చర్చించలేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆదివారం ఆరో విడత లోక్సభ ఎన్నికలు జరగనున్న […]
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో టికెట్ కోసం తన తండ్రి నుంచి కేజ్రీవాల్ ఆరు కోట్ల రూపాయలు తీసుకున్నారంటూ పశ్చిమ ఢిల్లీ ఆప్ అభ్యర్థి బల్బీర్ సింగ్ జాఖర్ కుమారుడు ఉదయ్ జాఖర్ చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. ఉదయ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో బల్బీర్ సింగ్ స్పందించారు. కుమారుడితో తాను చాలా తక్కువగా మాట్లాడతానని, అతడు ఆరోపిస్తున్న విషయమై తానెప్పుడూ చర్చించలేదని స్పష్టం చేశారు.
ఢిల్లీలో ఆదివారం ఆరో విడత లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉదయ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో స్పందించిన బల్బీర్ కుమారుడి ఆరోపణలను ఖండించారు. ఉదయ్ ఆరోపణల వెనక రాజకీయ పార్టీల ప్రోద్బలం ఉందని ఆరోపించారు. ఉదయ్ పుట్టగానే అతడి తల్లికి విడాకులు ఇచ్చానని, అతడు తనతో ఎప్పుడూ కలిసి లేడని బల్బీర్ వివరించారు. ఉదయ్ చేసి వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నట్టు తెలిపారు.