ఒంటరిగా పోటీ చేయాలన్నది తండ్రి కల ః చిరాగ్‌ పాశ్వాన్‌

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.. అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తికావడంతో పార్టీలన్నీ ప్రచారంపై దృష్టి పెట్టాయి.. బీహార్‌లో అంతో ఇంతో ఆదరణ ఉన్న లోక్‌ జనశక్తి పార్టీ ఈసారి కూటమి...

ఒంటరిగా పోటీ చేయాలన్నది తండ్రి కల ః చిరాగ్‌ పాశ్వాన్‌
Follow us

|

Updated on: Oct 15, 2020 | 12:43 PM

బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.. అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తికావడంతో పార్టీలన్నీ ప్రచారంపై దృష్టి పెట్టాయి.. బీహార్‌లో అంతో ఇంతో ఆదరణ ఉన్న లోక్‌ జనశక్తి పార్టీ ఈసారి కూటమి నుంచి బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేస్తుండటంతో రాజకీయ విశ్లేషకులకు కొత్త లెక్కలు వేసుకుంటున్నారు.. ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉంటూ, చనిపోయేంతవరకు కేంద్రమంత్రిగా ఉన్న రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ కూడా ఈసారి ఒంటరిగానే పోటీ చేయాలని అనుకున్నారట! ఈ విషయాన్ని ఆయన కుమారుడు చిరాగ్‌ పాశ్వానే చెబుతున్నారు.. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌తో విభేదాలు రావడంతో రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని అనుకున్నారు. అయితే దురదృష్టవశాత్తూ ఆయన మరణించడంతో పార్టీ బాధ్యతను, ప్రచార బాధ్యతను ఆయన కుమారుడు చిరాగ్‌ తన భుజాన వేసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని తమ నాన్న భావించారని, అలాగైతేనే పార్టీకి ఆదరణ, మనుగడ ఉంటాయని అనుకున్నారని చిరాగ్‌ అన్నారు. ఎన్‌డీఏ నుంచి విడిపోయినప్పటికీ బీజేపీతో పొత్తుకు కట్టుబడే ఉన్నామని పేర్కొన్నారు. నితీశ్‌కుమార్ ప్రభుత్వంపై పోరాడుతూనే ఉంటామన్నారు. నితీశ్‌కుమార్‌ మరో అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగితే బీహార్‌ పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతుందని చిరాగ్‌ అన్నారు. నితీశ్‌ సీఎంగా కొనసాగితే మాత్రం ప్రజలకు అంత కంటే పెద్ద ప్రమాదం మరొకటి ఉండదని తెలిపారు. తండ్రి మరణం తనను ఎంతగానో కుంగదీసిందని, ఆయన ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని అన్నారు చిరాగ్‌.. ఆయన పాటించిన విలువలను కొనసాగిస్తూ ముందుకు వెళతానని చెప్పారు. అయితే చిరాగ్‌ పాశ్వాన్‌ నిర్ణయాన్ని కొందరు బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ బతికి ఉంటే ఇలాంటి ఆలోచన చేసేవారు కాదంటున్నారు బీహార్‌ డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ మోదీ. లోక్‌జనశక్తి పార్టీ తమకు బీ టీమ్‌ అని కొందరు చేస్తున్న వ్యాఖ్యలను సుశీల్‌ మోదీ ఖండించారు. బీహార్‌కు సంబంధించినంత వరకు లోక్‌జనశక్తి పార్టీ ఎన్‌డీఏలో భాగస్వామి కాదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీఎం నితీశ్‌తో కలిసి ఓ డజను ఎన్నికల సభల్లో పాల్గొంటారని తెలిపారు. ఎన్నికలలో బీజేపీ ఎక్కువ స్థానాలను గెల్చుకుంటుందా? జేడీయూ ఎక్కువ స్థానాలను గెల్చుకుంటుందా అన్నది అప్రస్తుతమని, ఎవరు ఎక్కువ సీట్లు గెల్చుకున్నా ముఖ్యమంత్రిగా మాత్రం నితీశ్‌కుమారే ఉంటారని క్లారిటీ ఇచ్చారు సుశీల్ మోది. ఈ ఎన్నికలలో ఎల్‌జేపీ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చునని అన్నారు సుశీల్‌ మోది.

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు