Covid politcs మోదీపై ద్వేషమెందుకు? ఓవైసీని నిలదీసిన ముస్లిం నేత
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై నిప్పులు చెరిగారు ఓ ముస్లిం నేత. ఏపీకి చెందిన ముస్లిం నేత మోదీపై మీకెందుకు అంత ద్వేషం అంటూ ఓవైసీని నిలదీశారు.
Muslim leader questions Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై నిప్పులు చెరిగారు ఓ ముస్లిం నేత. ఏపీకి చెందిన ముస్లిం నేత మోదీపై మీకెందుకు అంత ద్వేషం అంటూ ఓవైసీని నిలదీశారు. దేశమంతా ఒక్కటై కరోనా వైరస్ నియంత్రణకు యుద్ధం చేస్తుంటే ఓవైసీకి ఎందుకు ఇంత బాధ అని ప్రశ్నించారు ఏపీ ముస్లిం లీడర్ ఒకరు.
ఓవైసీకి ముస్లింల పట్ల అంతప్రేమ ఉంటే ముస్లిం పేదలకు ఆహార కేంద్రాలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు ఏపీ బీజేపీకి చెందిన జాతీయ మైనారిటీ మోర్చ కార్యదర్శి షేక్ బాజీ. ఓవైసీ తన సొంత హాస్పిటల్ను కరోనా క్వారరెంటైన్ గాను, ఐసొలేషన్ వార్డులుగాను మార్చి వైరస్ బారిన పడిన పేద ముస్లింలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా వ్యాధిపై ముస్లింలలో అవగాహన కల్పించకుండా వారిని రెచ్చగొడుతున్న ఓవైసీ తన తీరును మార్చుకోవాలని షేక్ బాజీ సూచించారు.
సమాజంలో మత విద్వేషాలు సృష్టించి ముస్లింలను విడదీయాలనుకొంటున్నాడు ఓవైసీ అని ఆరోపించిన షేక్ బాజీ.. రాజకీయం వేరు జాతి విపత్తు వేరు అన్న సత్యాన్ని గుర్తించాలని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయం చేయాలని చూస్తే భారతీయ ముస్లింలు ఓవైసీకి తగిన బుద్ధిచెబుతారని హెచ్చరించారు. చికిత్సకు సహకరించకుండా వైరస్ ప్రబలడానికి కారణమవుతున్న వారిని ఓవైసీ వంటి వారు ఎడ్యుకేట్ చేయాలని, అలాంటి తన బాధ్యతను మరిచి నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని షేక్ బాజీ.. ఓవైసీకి వార్నింగ్ ఇచ్చారు.