పబ్లిసిటీ గిమ్మిక్.! ‘మర్డర్’ సినిమా ప్రెస్ మీట్ మిర్యాలగూడలో పెడితేనే కరెక్ట్.. అందుకే 22వ తేదీన షురూ చేస్తున్నాం : ఆర్జీవీ

వివాదాస్పద దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తోన్న సినిమా 'మర్డర్'. రిలీజ్ కు రెడీగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్ లో బిజీగా..

పబ్లిసిటీ గిమ్మిక్.! 'మర్డర్' సినిమా ప్రెస్ మీట్ మిర్యాలగూడలో పెడితేనే కరెక్ట్.. అందుకే  22వ తేదీన షురూ చేస్తున్నాం : ఆర్జీవీ
Follow us

|

Updated on: Dec 18, 2020 | 12:45 PM

వివాదాస్పద దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తోన్న సినిమా ‘మర్డర్’. రిలీజ్ కు రెడీగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు వర్మ. ఈనెల 24న సినిమా విడుదల చేస్తున్నాం అని చెప్పిన ఆయన, 22 వ తేదీన మిర్యాలగూడలో ప్రెస్ మీట్ పెడతామని బాంబు పేల్చారు. ‘ఎన్నో నిజ జీవితాలపై తీసిన యదార్థ కథ. ఈ సినిమా అన్ని అడ్డంకులు పూర్తి చేసుకొని ఈ నెల 24న విడుదల చేస్తున్నాం. కాబట్టి మేము 22వ తేదీన మిర్యాలగూడలో ప్రెస్ మీట్ పెట్టాలని నిర్ణయించుకున్నాం. మీడియా సమావేశం అక్కడ పెడితేనే కరెక్ట్ ఉంటుందని భావిస్తున్నాము. ఈ సినిమా పిల్లలకు తల్లిదండ్రులకు జరిగే కంటిన్యూ యుద్ధం. వారి ఇష్టాలను కాదన్నపుడు చాలామందికి ఏం నష్టం జరుగుతుందనేది ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది’ అని వర్మ చెప్పుకొచ్చారు. ఇలా ఉండగా, మిర్యాలగూడలో మారుతీరావ్ ఉదంతం ఆధారంగా తెరకెక్కిస్తోన్న మర్డర్ సినిమా ఆపాలంటూ కోర్టుల్లో కేసులు దాఖలైన సంగతి తెలిసిందే.