సెకండ్ హ్యాండ్ ఫోన్ కొని చిక్కుల్లో పడింది…చివరకు పోలీసులో కొత్త ఫోన్ కొనిచ్చారు..ఆసక్తికర కథనం
ప్రజంట్ కరోనా ప్రభావంతో విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కుమారుడి చదువుల కోసం స్థోమత లేక సెకండ్ హ్యాండ్ ఫోన్ కొన్న ఓ మహిళ చిక్కుల్లో పడింది.
ప్రజంట్ కరోనా ప్రభావంతో విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కుమారుడి చదువుల కోసం స్థోమత లేక సెకండ్ హ్యాండ్ ఫోన్ కొన్న ఓ మహిళ చిక్కుల్లో పడింది. అది తస్కరించిన ఫోన్ అవ్వటం చేత ఓ రోజంతా పోలీస్ స్టేషన్లో ఉండాల్సి వచ్చింది. చివరకు పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడటంతో ఊపిరి పీల్చుకుంది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబై, బోరివ్లీకి చెందిన స్వాతి సుభాష్ సావ్రే తన కుమారుడి ఆన్లైన్ చదువుల కోసం కొద్దిరోజుల క్రితం 6 వేల రూపాయలు పెట్టి సెకండ్ హ్యాండ్ ఫోన్ కొన్నది. దాని రిపేర్ల కోసం మరో రూ. 1,500 ఖర్చు చేసింది. అనంతరం అందులో సిమ్ కార్డు వేసి వినియోగించడం ప్రారంభించారు. అయితే ఆ తర్వాతి రోజు స్వాతి ఇంటి వద్దకు వచ్చిన పోలీసులు.. అది దొంగిలించిన ఫోన్ అని చెప్పి, ఆమెను రైల్వే పీఎస్కు తీసుకెళ్లారు.
ఓ రోజు మొత్తం విచారించి దొంగతనంతో ఆమెకు ఎటువంటి సంబంధం లేదని నిర్దారించారు. అయితే స్వాతి ఆ ఫోన్ను కొనడానికి దాదాపు మూడు నెలల పాటు ఎంతో కష్టపడింది. రూపాయి..రూపాయి కూడబెట్టి మరీ కొడుక్కి ఫోన్ కొనిచ్చింది.ఇప్పుడు ఫోన్ లేకపోతే కుమారుడి చదువు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. స్వాతి పనిచేస్తున్న ఇంటి ఓనర్తో తన గోడును వెళ్లబోసుకుందామె. ఆ యజమాని ఈ విషయాన్ని ముంబై పోలీసులకు ట్వీట్ చేశాడు. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. అనంతరం కుమారుడి చదువు కోసం ఆమెకు సెల్ ఫోన్ను బహుమతిగా ఇచ్చి మంచి మనసు చాటుకున్నారు.
Also Read :
బాలయ్య సినిమాలో రాజశేఖర్..కానీ కండీషన్స్ అప్లై..ఏ పాత్ర వేస్తున్నారంటే ?
వెంకన్న సన్నిధిలో శాస్త్రోక్తంగా దీపావళి వేడుకలు, శ్రీవారికి హుండీ ఆదాయం ఎంత వచ్చిందంటే ?