ఐపీఎల్ ఛాంపియన్‌గా ముంబై

ఢిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్​లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఫలితంగా ఐదోసారి టైటిల్ సాధించి రికార్డు సొంతం చేసుకుంది.

ఐపీఎల్ ఛాంపియన్‌గా ముంబై
Follow us

|

Updated on: Nov 10, 2020 | 11:41 PM

Fifth Time IPL Champions : ఢిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్​లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఫలితంగా ఐదోసారి టైటిల్ సాధించి రికార్డు సొంతం చేసుకుంది. ముంబై సారథి రోహిత్ శర్మ (68) అద్భుత ఇన్నింగ్స్​తో జట్టుకు విజయాన్నందించాడు. ఢిల్లీ విధించిన 157 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది రోహిత్​సేన.

టార్గెట్ ఛేదనకు దిగిన ముంబై మెరుపు వేగంతో దిగింది. డికాక్ (20/ 12 బంతుల్లో, మూడు 4,  నాలుగు 6), రోహిత్ ముందు నుంచే బౌలర్లపై విరుచుకుపడటంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. అయితే అయిదో ఓవర్‌లో డికాక్‌ను స్టాయినిస్‌ బోల్తాకొట్టించాడు.

కాగా, ఫస్ట్ ‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ కూడా బ్యాటుకు పనిచెప్పడంతో ముంబై పవర్‌ప్లేలో 61 పరుగులు చేసింది. అయితే శ్రేయస్‌ స్పిన్నర్లకు బంతి అందించడంతో స్కోరు వేగానికి కాస్త బ్రేకులు పడ్డాయి. ఈ దశలో అనవసర పరుగుకు రోహిత్‌ ప్రయత్నించగా.. సూర్యకుమార్ కెప్టెన్‌ కోసం తన వికెట్‌ను త్యాగం చేశాడు. అనంతరం హిట్‌మ్యాన్‌ చెలరేగాడు. బౌండరీల మోత మోగిస్తూ 36 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. క్రీజులోకి వచ్చిన ఇషాన్ 19 బంతుల్లో 33 పరుగులు చేసి అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించడంతో ముంబై విజయం దిశగా సాగింది. రోహిత్‌, పొలార్డ్‌ (9) స్వల్పవ్యవధిలోనే ఔటైనా ఇషాన్ జట్టుకు విజయాన్ని అందించాడు. ఢిల్లీ బౌలర్లలో నోర్జె రెండు, రబాడ, స్టాయినిస్‌ చెరో వికెట్ తీశారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..