చెన్నై విజయాలకు ముంబై చెక్
ఐపీఎల్ 12వ సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై సూపర్కింగ్స్ జోరుకు కళ్లెం వేసింది ముంబై ఇండియన్స్. హ్యాట్రిక్ విజయాలతో అదరగొట్టిన ధోనీసేనకు ఈ సీజన్లో తొలి ఓటమి రుచి చూపింది ముంబై ఇండియన్స్ జట్టు. చెన్నై సూపర్కింగ్స్తో మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటి 37 పరుగుల తేడాతో విజయం సాధించింది . తొలుత సూర్యకుమార్ యాదవ్ 59, కృనాల్ పాండ్య 42, హార్దిక్ పాండ్య 25 మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల […]
ఐపీఎల్ 12వ సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై సూపర్కింగ్స్ జోరుకు కళ్లెం వేసింది ముంబై ఇండియన్స్. హ్యాట్రిక్ విజయాలతో అదరగొట్టిన ధోనీసేనకు ఈ సీజన్లో తొలి ఓటమి రుచి చూపింది ముంబై ఇండియన్స్ జట్టు. చెన్నై సూపర్కింగ్స్తో మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటి 37 పరుగుల తేడాతో విజయం సాధించింది . తొలుత సూర్యకుమార్ యాదవ్ 59, కృనాల్ పాండ్య 42, హార్దిక్ పాండ్య 25 మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ముంబై 170 పరుగులు చేసింది. ఇక 171 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 8 వికెట్లు కోల్పోయి 133 పరుగులకే పరిమితమైంది. కేదార్ జాదవ్ 58 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా… హార్దిక్ పాండ్య (3/20), మలింగ (3/34), బెరెన్డార్ఫ్ (2/22) చెన్నైకి కళ్లెం వేశారు. దీంతో 37 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. హార్దిక్కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. కాగా ఈ మ్యాచ్తో.. ఐపీఎల్ ప్రారంభం నుంచి ముంబయి ఇండియన్స్ 175 మ్యాచులాడితే అందులో 100 మ్యాచుల్లో విజయం సాధించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే .