నిబంధనలకు అనుగుణంగా మొహర్రం…
తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతుండటంతో మొహర్రం పండగను నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని మైనారిటీశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోంమంత్రి మహమూద్అలీ
తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతుండటంతో మొహర్రం పండగను నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని మైనారిటీశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోంమంత్రి మహమూద్అలీ సూచించారు. ఈనెలాఖరులోనే వస్తున్న పండగ ఏర్పాట్లపై మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు.
మైనారిటీ వర్గాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పండగ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సంవత్సరం కూడా అన్నివర్గాల పండగల నిర్వహణకు ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఈసారి మొహర్రం పండగ సందర్భంగా మైనారిటీలకు ఏ విధమైన ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా నిబంధనలు ప్రజలు తప్పుకుండా పాటించాలని సూచించారు. నిబందనల్లో భాగంగా సోషల్ డిస్టెన్స్, మాస్కులు ధరించడం తప్పనిసరి అని అన్నారు.
కరోనా మహమ్మారి ప్రభావం ఈ ఏడాది పండుగలపై తీవ్రంగా పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రంజాన్, శ్రీరామ నవమి, బోనాలు వంటి పండుగలు నిరాడంబరంగా జరిగిపోగా వినాయక చవితి పండుగపైనా ఈ ప్రభావం బాగా పడుతోంది. ఇక వినాయక చవితి పండుగ కూడా నిరాడంబరంగా జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే…