ఇల్లందు సింగరేణిలో మొహర్రం..అదో మానని గాయం
ఇల్లందు సింగరేణిలో మొహర్రం అంటే మానని గాయంగా గుర్తుంపెట్టుకుంటారు అక్కడి కార్మికులు. ప్రభుత్వ, ప్రవేటు సంస్థలన్నింటికీ.. అన్ని పండగల మాదిరిగానే మోహరం సందర్భంగా సెలవులను ప్రకటిస్తాయి. కానీ సింగరేణి వ్యాప్తంగా మొహరం నాడు హాలిడే ప్రకటించడంలో ప్రత్యేకతను సంతరించుకుంది. అంతేకాదు సింగరేణి అన్ని ఏరియాల్లో కెల్లా ఇల్లందుది మరో స్పెషల్. రాష్ట్రంలోని సింగరేణి అంతట సాధారణ సెలవును ఆదివారంగా కొనసాగిస్తోంది యజమాన్యం. కానీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియా లో మాత్రం శుక్రవారం సెలవు దినంగా […]
ఇల్లందు సింగరేణిలో మొహర్రం అంటే మానని గాయంగా గుర్తుంపెట్టుకుంటారు అక్కడి కార్మికులు. ప్రభుత్వ, ప్రవేటు సంస్థలన్నింటికీ.. అన్ని పండగల మాదిరిగానే మోహరం సందర్భంగా సెలవులను ప్రకటిస్తాయి. కానీ సింగరేణి వ్యాప్తంగా మొహరం నాడు హాలిడే ప్రకటించడంలో ప్రత్యేకతను సంతరించుకుంది. అంతేకాదు సింగరేణి అన్ని ఏరియాల్లో కెల్లా ఇల్లందుది మరో స్పెషల్. రాష్ట్రంలోని సింగరేణి అంతట సాధారణ సెలవును ఆదివారంగా కొనసాగిస్తోంది యజమాన్యం. కానీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియా లో మాత్రం శుక్రవారం సెలవు దినంగా నిర్వహిస్తోంది. అంతేకాదు.. ఇల్లందులో మొహర్రంకు, శుక్రవారం సెలవుకు వెనక ఏళ్లనాటి చరిత్రే ఉందంటున్నారు సింగరేణి యజమాన్యం, సిబ్బంది. ఇల్లందు ఏరియాలో బ్రిటిష్ భూగర్భ పరిశోధన అధికారి విలియం కింగ్ 1871 లో ఇక్కడ బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టుగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు “ది దక్కన్ కంపెనీ లిమిటెడ్” అనే ప్రైవేట్ కంపెనీ 1886లో త్రవ్వకాలను ప్రారంభించింది. 1889 నాటికి ఉత్పత్తిని ప్రారంభించింది.( బ్రిటిష్ హయాంలో బొగ్గు తవ్వకాలు ప్రైవేట్ కంపెనీ ఆధీనంలో ఉండేది.) అనంతరం బొగ్గును సింగరేణి అనే గ్రామం వద్ద కనిపెట్టడంతో 1920 సంవత్సరంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్గా మార్చుతూ పబ్లిక్ లిమిటెడ్ చేశారు. ఇల్లందులో అండర్ గ్రౌండ్ ద్వారా బొగ్గు ఉత్పత్తిని వెలికి తీస్తున్నారు.