సామాన్యుడి జీవితాన్ని మార్చేసిన ముద్ర
ఎన్నికల ఫలితాలు దేశ భవిష్యత్తుకు నాంది పలికాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశభద్రత, ఆర్థికాభివృద్ధి మన ముందున్న ప్రధాన లక్ష్యాలని చెప్పారు. ముద్ర సామాన్యుడి జీవితాన్ని మార్చి వేసిందని గుర్తు చేశారు. ఉద్యోగ కల్పనే ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యమని చెప్పారు. భారతీయ రైల్వేలో 13 లక్షల మంది పనిచేస్తున్నారని తెలిపారు. మేకిన్ ఇండియాకు మంచి స్పందన లభిస్తోందని ఆమె అన్నారు. పారిశ్రామిక సంస్థలు సంపదను, ఉపాధిని సృష్టిస్తున్నాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. విదేశీ […]
ఎన్నికల ఫలితాలు దేశ భవిష్యత్తుకు నాంది పలికాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశభద్రత, ఆర్థికాభివృద్ధి మన ముందున్న ప్రధాన లక్ష్యాలని చెప్పారు. ముద్ర సామాన్యుడి జీవితాన్ని మార్చి వేసిందని గుర్తు చేశారు. ఉద్యోగ కల్పనే ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యమని చెప్పారు. భారతీయ రైల్వేలో 13 లక్షల మంది పనిచేస్తున్నారని తెలిపారు. మేకిన్ ఇండియాకు మంచి స్పందన లభిస్తోందని ఆమె అన్నారు. పారిశ్రామిక సంస్థలు సంపదను, ఉపాధిని సృష్టిస్తున్నాయని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. విదేశీ పెట్టుబడులు పెంచేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు.