ఆడింది చాలు.. ధోని రిటైర్మెంట్పై పేరెంట్స్ విష్!
టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్పై కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక అతడి తల్లిదండ్రులు కూడా ధోని అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకాలని కోరుకుంటున్నట్లు చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జీ వెల్లడించాడు. ఇటీవలే ఇంగ్లాండ్లో జరిగిన వరల్డ్కప్ను కైవసం చేసుకుని ధోనికి ఘనంగా ఫేర్వెల్ ఇవ్వాలని టీమిండియా భావించగా.. తొలి సెమీస్లో న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీనితో ధోని రిటైర్మెంట్ […]
టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్పై కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక అతడి తల్లిదండ్రులు కూడా ధోని అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకాలని కోరుకుంటున్నట్లు చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జీ వెల్లడించాడు. ఇటీవలే ఇంగ్లాండ్లో జరిగిన వరల్డ్కప్ను కైవసం చేసుకుని ధోనికి ఘనంగా ఫేర్వెల్ ఇవ్వాలని టీమిండియా భావించగా.. తొలి సెమీస్లో న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీనితో ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు జోరుగా వచ్చాయి. అయితే దానిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంతవరకు రాలేదు.
వెస్టిండీస్ టూర్కు ఎంపికపై సందిగ్దత..
ఇది ఇలా ఉండగా శుక్రవారం టీమిండియా సెలక్షన్ కమిటీ ముంబైలో సమావేశమై వెస్టిండీస్ టూర్కు జట్టును ఎంపిక చేయనుంది. ఈ నేపథ్యంలో ధోనిని వాళ్ళు ఎంపిక చేస్తారా.? లేదా అని సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.
ధోని తల్లిదండ్రుల మాట…
అటు ఈ విషయంపై ధోని చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ.. ‘ధోనీ క్రికెట్కు గుడ్బై చెబితేనే బాగుంటుందని అతడి తల్లిదండ్రులు కోరుకుంటున్నారని ఆయన వెల్లడించారు. “గత ఆదివారం నేను ధోనీ ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులతో మాట్లాడాను. ధోనీ ఇక క్రికెట్ను విడిచిపెడితే బాగుంటుందని వారు కోరుకుంటున్నారు” అని ఆయన తెలిపాడు.
చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జీ మాట…
ఇంతకాలం ధోని క్రికెట్ను ఎంతో ఇష్టంతో ఆడాడని.. ఇప్పటికైనా రిటైర్మెంట్ ప్రకటించి.. తమతో పాటు ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నట్లు అతడి తల్లిదండ్రులు ఆశిస్తున్నట్లు కేశవ్ బెనర్జీ చెప్పుకొచ్చారు. అయితే ధోని వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుందని తాను అనుకుంటున్నట్లు కేశవ్ తన మనసులోని మాటను పంచుకున్నాడు.