కోహ్లీసేనకు కొత్త ‘ఆరెంజ్ జెర్సీ!

ఐసీసీ ప్రపంచకప్‌ 2019లో భాగంగా మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం ఇంగ్లాండ్‌ X భారత్‌ మధ్య జరిగే మ్యాచ్‌లో కోహ్లీసేన కొత్త జెర్సీలను ధరించనుంది. ఇంగ్లాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా ధరించే అరెంజ్ జెర్సీని టీమిండియా అధికారిక అపరెల్ స్పాన్సర్ నైకీ శుక్రవారం విడుదల చేసింది. ఇంగ్లాండ్, ఇండియా దేశాలకు చెందిన జట్ల జెర్సీలు నీలి రంగులో ఉండటంతో మ్యాచ్ వీక్షించేటప్పుడు అభిమానులు, అంపైర్లు, మైదానంలోని ఆటగాళ్లు కూడా గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. […]

కోహ్లీసేనకు కొత్త 'ఆరెంజ్ జెర్సీ!
Follow us

| Edited By:

Updated on: Jun 29, 2019 | 8:51 PM

ఐసీసీ ప్రపంచకప్‌ 2019లో భాగంగా మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం ఇంగ్లాండ్‌ X భారత్‌ మధ్య జరిగే మ్యాచ్‌లో కోహ్లీసేన కొత్త జెర్సీలను ధరించనుంది. ఇంగ్లాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా ధరించే అరెంజ్ జెర్సీని టీమిండియా అధికారిక అపరెల్ స్పాన్సర్ నైకీ శుక్రవారం విడుదల చేసింది. ఇంగ్లాండ్, ఇండియా దేశాలకు చెందిన జట్ల జెర్సీలు నీలి రంగులో ఉండటంతో మ్యాచ్ వీక్షించేటప్పుడు అభిమానులు, అంపైర్లు, మైదానంలోని ఆటగాళ్లు కూడా గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. దీంతో హోమ్.. అవే విధానంలో ఆతిథ్య జట్టు ధరించే జెర్సీలో ఎలాంటి మార్పు ఉండదు. దీంతో టీమిండియా నారింజ రంగు జెర్సీ వేసుకోవాల్సి వస్తోంది.

టీమిండియా కొత్త జెర్సీలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. కొత్తగా ఆ జెర్సీలను ధరిస్తూ కోహ్లీసేన తాజాగా ఫొటోలకు ఫోజులిచ్చింది. రేపు జరగబోయే మ్యాచ్‌లో ఎలా కనిపిస్తారో తెలియజేస్తూ క్రికెట్‌ ప్రపంచకప్‌ ట్విటర్‌లో ఈ ఫొటోలను షేర్‌ చేసింది. ఇందులో ముదురు నీలం రంగుతో పాటు నారింజ రంగు కూడా జోడించారు. దీంతో ఈ ఫొటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

https://www.instagram.com/p/BzSX7Iolo3x/?utm_source=ig_web_copy_link