ధోనికి నో ప్లేస్.. పంత్కు ఛాన్స్!
మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ గురించి ఈ మధ్య కాలంలో చాలా వార్తలు ఊపందుకున్నాయి. స్లో బ్యాటింగ్, కీపింగ్ తప్పిదాలతో రిటైర్మెంట్పై మరింత ఒత్తిడి పెరిగింది. ప్రపంచకప్ అనంతరం ధోనీ క్రికెట్కు గుడ్బై చెప్పనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే అనూహ్యంగా భారత్ సెమీస్ నుండి నిష్క్రమించినా.. రిటైర్మెంట్పై ధోనీ ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ధోనీ రిటైర్మెంట్పై మాకు ఎలాంటి సమాచారం లేదు. ధోనీ కూడా మాకు ఏమీ చెప్పలేదు అని సెమీస్ మ్యాచ్ అనంతరం కెప్టెన్ […]
మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ గురించి ఈ మధ్య కాలంలో చాలా వార్తలు ఊపందుకున్నాయి. స్లో బ్యాటింగ్, కీపింగ్ తప్పిదాలతో రిటైర్మెంట్పై మరింత ఒత్తిడి పెరిగింది. ప్రపంచకప్ అనంతరం ధోనీ క్రికెట్కు గుడ్బై చెప్పనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే అనూహ్యంగా భారత్ సెమీస్ నుండి నిష్క్రమించినా.. రిటైర్మెంట్పై ధోనీ ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ధోనీ రిటైర్మెంట్పై మాకు ఎలాంటి సమాచారం లేదు. ధోనీ కూడా మాకు ఏమీ చెప్పలేదు అని సెమీస్ మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. అయితే ఆగస్ట్లో వెస్టీండీస్ టూర్కు టీమిండియా వెళ్లనుంది. ఈ మ్యాచ్లకు ధోనీ గైర్హాజరవుతున్నట్లు బీసీసీఐ వర్గాల నుండి సమాచారం అందుతోంది. వికెట్ కీపర్గా ధోనీ స్థానంలో రిషబ్ పంత్ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది.