సైనిక విధులు ముగిశాయ్.. స్వస్థలానికి ధోని..
క్రికెట్కు విరామం ఇచ్చి సైనిక విధుల్లో చేరిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సైనిక సేవలు నిన్నటితో ముగిశాయి. నిన్న స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో లద్దాఖ్లోని సైనిక ఆసుపత్రిలో జవానులతో గడిపాడు ధోని. పారాచ్యూట్ రెజిమెంట్లో గౌరవ లెఫ్టినెంట్ హోదాలో ఉన్న మహి.. సహచర జవాన్లతో కలిసి బుధవారమే లద్దాఖ్కు చేరుకున్నాడు. స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఇక్కడి సైనిక ఆసుపత్రిలో జవాన్లతో ముచ్చటించాడు. అతను సియాచిన్ యుద్ధ వీరులకు నివాళి అర్పించేందుకు వెళ్తున్నట్లు […]
క్రికెట్కు విరామం ఇచ్చి సైనిక విధుల్లో చేరిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సైనిక సేవలు నిన్నటితో ముగిశాయి. నిన్న స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో లద్దాఖ్లోని సైనిక ఆసుపత్రిలో జవానులతో గడిపాడు ధోని. పారాచ్యూట్ రెజిమెంట్లో గౌరవ లెఫ్టినెంట్ హోదాలో ఉన్న మహి.. సహచర జవాన్లతో కలిసి బుధవారమే లద్దాఖ్కు చేరుకున్నాడు. స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఇక్కడి సైనిక ఆసుపత్రిలో జవాన్లతో ముచ్చటించాడు. అతను సియాచిన్ యుద్ధ వీరులకు నివాళి అర్పించేందుకు వెళ్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. గురువారంతోనే ధోని తాత్కాలిక విధులు ముగిశాయి. నేడు ఢిల్లీ నుంచి ఆయన స్వస్థలం రాంచికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.