ధోనికి నిద్రలో కూడా పబ్జీ పిచ్చే..సాక్షి కంప్లైంట్..!
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీ మెంబర్స్ తో విలువైన సమయాన్ని గడుపుతున్నాడు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ. అయితే అతడు పడుకుని నిద్రపోతున్నప్పుడు కూడా పబ్జీ గేమ్ గురించి కలవరిస్తున్నాడని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది ధోని భార్య సాక్షి సింగ్. చెన్నై సూపర్కింగ్స్ నిర్వహించిన ఇన్స్టాలో లైవ్లో పాల్గొన్న ఆమె మహీ గురించి చాలా విషయాలు చెప్పింది. ”ధోని ఎప్పుడూ ఏదో ఒకటి థింక్ చేస్తూనే ఉంటాడు. […]
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీ మెంబర్స్ తో విలువైన సమయాన్ని గడుపుతున్నాడు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ. అయితే అతడు పడుకుని నిద్రపోతున్నప్పుడు కూడా పబ్జీ గేమ్ గురించి కలవరిస్తున్నాడని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది ధోని భార్య సాక్షి సింగ్. చెన్నై సూపర్కింగ్స్ నిర్వహించిన ఇన్స్టాలో లైవ్లో పాల్గొన్న ఆమె మహీ గురించి చాలా విషయాలు చెప్పింది.
”ధోని ఎప్పుడూ ఏదో ఒకటి థింక్ చేస్తూనే ఉంటాడు. అతని మైండ్ కు రెస్ట్ లేదు. పబ్జీ ఆడేటప్పుడు మాత్రం అతడి మనసు మళ్లుతుంది. ఇటీవలి కాలంలో బెడ్పై కూడా ధోనీ ఆ గేమ్ గురించే ఆలోచిస్తున్నాడు. నిద్రలో సైతం పబ్జీని కలవరిస్తున్నాడు” అని సాక్షి సింగ్ పేర్కొన్నారు.
అలానే లాక్డౌన్ సమయంలో ధోని ఎక్కువ సమయాన్ని బైక్లతో గడుపుతున్నాడని సాక్షి చెప్పింది. మహీకి మొత్తం 9 బైకులు ఉన్నాయని..వాటికి సంబంధించిన కొత్త స్పేర్ పార్ట్స్ ప్రస్తుతం అమర్చుతున్నాడని వెల్లడించింది. 38 ఏళ్ల ధోనీ చివరగా, గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఆడాడు. ఆ తర్వాత ఆటకు టెంపరరీ విరామం ప్రకటించాడు. కాగా ధోని రిటైర్మెంట్ కు సంబంధించి రోజుకో వార్త షికారు చేస్తూనే ఉంటుంది.