కూతురు జీవాతో కలిసి ధోనీ బైక్ రైడ్
లాక్డౌన్ నేపథ్యంలో క్రీడాకారులంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా కుటుంబంతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతున్నారు. రాంచీలోని తన ఫామ్హౌస్లో కుమార్తె జీవాతో..
లాక్డౌన్ నేపథ్యంలో క్రీడాకారులంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా కుటుంబంతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతున్నారు. రాంచీలోని తన ఫామ్హౌస్లో కుమార్తె జీవాతో కలిసి బైక్పై సవారి చేశారు. ఈ వీడియో తీసిన ధోని భార్య సాక్షి.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ట్విట్టర్లో షేర్ చేశారు. కాగా సాక్షి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటారు. ముఖ్యంగా ధోని, జీవాలకు సంబంధించిన ప్రతీ విషయాన్ని ఆమె అభిమానులతో పంచుకుంటారు. ఇటీవలే ధోనీ ఫామ్హౌస్లోని గార్డెన్లో పని చేస్తున్న ఫొటోను కూడా ఆమె ట్విట్టర్లో షేర్ చేశారు.
Thala Suthifying, literally! ??? #WhistlePodu VC: @SaakshiSRawat pic.twitter.com/0xpOxVoVET
— Chennai Super Kings (@ChennaiIPL) April 20, 2020
Read More:
జగన్ ప్రభుత్వం వల్ల రూ.1400 కోట్లు వృథా.. కన్నా సంచలన వ్యాఖ్యలు
పవన్తో సినిమా నేను చేయలేను.. జక్కన్న సెన్సేషనల్ కామెంట్స్
ట్రాన్స్జెండర్లకు కేంద్రం గుడ్న్యూస్.. అన్ని అప్లికేషన్స్లోనూ..