రిటైర్మెంట్ ప్రకటించాక హత్తుకొని చాలా ఏడ్చాము: రైనా
స్వాతంత్య్ర దినోత్సవం రోజు క్రికెట్ అభిమానులందరికీ షాక్ ఇస్తూ ధోని, రైనా ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
Raina on retirement: స్వాతంత్య్ర దినోత్సవం రోజు క్రికెట్ అభిమానులందరికీ షాక్ ఇస్తూ ధోని, రైనా ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ని ప్రకటించిన విషయం తెలిసిందే. మొదట ధోని రిటైర్మెంట్ని ప్రకటించగా.. కాసేపటికే తాను కూడా రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు రైనా సోషల్ మీడియాలో వెల్లడించారు(బీసీసీఐ ఆదివారం అధికారిక ప్రకటన ఇచ్చింది). దీంతో క్రికెట్ అభిమానుల బాధ మరింత ఎక్కువైంది. కాగా వారిద్దరు ఈ అనౌన్స్మెంట్ ఇచ్చిన తరువాత చాలా ఏడ్చారట. ఈ విషయాన్ని రైనా వెళ్లడించారు.
చెన్నైకి వచ్చిన తరువాత ధోని రిటైర్మెంట్ తీసుకోబోతున్న విషయం నాకు తెలిసింది. నేను కూడా రిటైర్మెంట్కి సిద్ధంగా ఉన్నా. అధికారిక ప్రకటన ఇచ్చిన తరువాత మేమిద్దరం హత్తుకొని చాలా సేపు ఏడ్చాము. ఆ తరువాత పియూష్, అంబటి రాయుడు, కేదర్ జాదవ్, కరణ్లతో కూర్చొని కెరీర్, సంబంధాల గురించి మాట్లాడాను. ఆ రోజు రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ సభ్యులతో పార్టీ చేసుకున్నాము అని రైనా తెలిపారు. కాగా ఇంటర్నేషనల్ క్రికెట్కి గుడ్బై చెప్పినప్పటికీ.. ధోని, రైనా త్వరలో ఐపీఎల్లో కనిపించనున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ తరుఫున ఈ ఇద్దరు ఆడనుండగా.. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.
Read More: