పెళ్లికి కొన్ని గంటల ముందు గొంతు కోసి వధువు హత్య..
మధ్యప్రదేశ్లో దారుణం ఘటన చోటుచేసుకుంది. పెళ్లికూతురు మేకప్ కోసం బ్యూటీపార్లర్కు వెళ్లిన ఓ వధువు అక్కడే దారుణ హత్యకు గురైంది. రాట్లాం జిల్లాలోని జోరా సిటీలో ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మధ్యప్రదేశ్లో దారుణం ఘటన చోటుచేసుకుంది. పెళ్లికూతురు మేకప్ కోసం బ్యూటీపార్లర్కు వెళ్లిన ఓ వధువు అక్కడే దారుణ హత్యకు గురైంది. రాట్లాం జిల్లాలోని జోరా సిటీలో ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
వివరాల్లోకి షాజాపూర్ చెందిన సోనూ యాదవ్ అనే యువతికి మూడేళ్ల క్రితం ఓ కార్యక్రమంలో రామ్ యాదవ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా.. స్నేహంగా మారి ప్రేమ వరకు వెళ్లింది. అయితే మధ్యలో విభేదాలు తలెత్తడంతో ఇద్దరూ విడిపోయారు. ఈ క్రమంలో సోనూకు జూలై 5న మరొకరితో పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. దీంతో షాజాపూర్ నుంచి సోనూను తీసుకుని జోరా సిటీకి వచ్చారు. వివాహానికి కొన్ని గంటల ముందు పెళ్లికూతురి మేకప్ కోసం సోనూ తన బంధువుతో కలిసి దగ్గర్లోని బ్యూటీ పార్లర్కు వెళ్లింది. ముందే జోరాకు చేరుకున్న రామ్ యాదవ్ సోనూ జాడ కోసం వెతుకులాట ప్రారంభించాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో తన ఫ్రెండ్ పవన్ పంచాల్ ఫోన్ నుంచి కాల్ చేసి.. ఆమె బ్యూటీపార్లర్లో ఉన్నట్లు తెలుసుకున్నాడు. వెంటనే అక్కడికి వెళ్లి సోనూ గొంతు కోసి చంపేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత రామ్ యాదవ్..అక్కడ్నుంచి రాజస్థాన్కు పరారయ్యాడు. కాగా సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరు వ్యక్తులను గుర్తించిన పోలీసులు పవన్ను అదుపులోకి తీసుకున్నారు. రామ్ యాదవ్ తన ప్రేమను తిరస్కరించిందన్న పగతోనే ఈ హత్యకు పాల్పడినట్లు అతడు విచారణలో తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రామ్ యాదవ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.