కేసీఆర్ను దించేందుకు త్వరలో యాగం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను సీఎం సీటు నుంచి దింపేందుకు త్వరలో యాగం చేస్తానన్నారు ఇటీవల బీజేపీలో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. కేసీఆర్ పతనం చూడటమే తన లక్ష్యమని మోత్కుపల్లి ప్రకటించారు. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి శనివారం నాడు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన మోత్కుపల్లికి టీ.బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మాట్లాడిన మోత్కుపల్లి… కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను సీఎం సీటు నుంచి దింపేందుకు త్వరలో యాగం చేస్తానన్నారు ఇటీవల బీజేపీలో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. కేసీఆర్ పతనం చూడటమే తన లక్ష్యమని మోత్కుపల్లి ప్రకటించారు. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి శనివారం నాడు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన మోత్కుపల్లికి టీ.బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా మాట్లాడిన మోత్కుపల్లి… కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేసిన మోత్కుపల్లి నరసింహులు.. కేసీఆర్ను సీఎం సీటు నుంచి దించేయాలని లక్ష్మీనరసింహ స్వామిని మొక్కుకున్నానన్నారు. రాష్ట్రానికి పట్టిన శని కేసీఆర్ను దించేయటానికి ప్రత్యేక యాగం చేస్తానన్నారు మోత్కుపల్లి. సీఎం కేసీఆర్ను ఎనిమిదో నిజాంతో పోల్చిన మోత్కుపల్లి.. ఆయన హయాంలో తెలంగాణ ప్రజలకు బానిసలుగా బ్రతికే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు.
కేసీఆర్ దగ్గరకు ఆయన కొడుకు, బిడ్డ, అల్లుడికి తప్ప ఎవరికీ ప్రవేశం లేదని విమర్శించారు. తెలంగాణలో దళితుల అభివృద్ధే తనకు ముఖ్యమన్న మోత్కుపల్లి.. కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని ఆరోపించారు.