తల్లి మరణం తట్టుకోలేక..ఆ కొడుకు గుండె ఆగింది

తల్లి మరణం తట్టుకోలేక ఓ కొడుకు గుండె ఆగిపోయింది. కనిపెంచిన కన్నతల్లి ఇక లేదని తెలిసి ఆ కుమారుడు తట్టుకోలేకపోయాడు. అమ్మ మరణవార్త విన్న వెంటనే తాను కూడా తనువు చాలించాడు. ఈ విషాదం సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో సంభవించిన తల్లికొడుకుల హఠ్మారణం ఆ ఇంటిని తీరని విషాదంలో ముంచేసింది. జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామంలో ఒకేరోజు తల్లి కుమారుడు మరణించారు. బచ్చోడు గ్రామానికి చెందిన పులి పలుపుల శాంతమ్మ(70) అనారోగ్యంతో […]

తల్లి మరణం తట్టుకోలేక..ఆ కొడుకు గుండె ఆగింది
Follow us

|

Updated on: Nov 09, 2019 | 8:49 PM

తల్లి మరణం తట్టుకోలేక ఓ కొడుకు గుండె ఆగిపోయింది. కనిపెంచిన కన్నతల్లి ఇక లేదని తెలిసి ఆ కుమారుడు తట్టుకోలేకపోయాడు. అమ్మ మరణవార్త విన్న వెంటనే తాను కూడా తనువు చాలించాడు. ఈ విషాదం సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో సంభవించిన తల్లికొడుకుల హఠ్మారణం ఆ ఇంటిని తీరని విషాదంలో ముంచేసింది. జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామంలో ఒకేరోజు తల్లి కుమారుడు మరణించారు. బచ్చోడు గ్రామానికి చెందిన పులి పలుపుల శాంతమ్మ(70) అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఆమె మరణ వార్త విన్న పెద్ద కొడుకు వెంకన్న(50)తల్లి శాంతమ్మ మరణవార్త వినగానే గంట వ్యవధిలోనే గుండెపోటుతో మృతి చెందాడు. ఆ కుటుంబంలో శాంతమ్మ కు ఐదుగురు కుమారులు కాగా, వెంకన్న పెద్ద కుమారుడు తల్లి పెద్ద కుమారుడు పై ఎక్కువ ప్రేమానురాగాలు చూపడంతో తల్లి మరణ వార్త విన్న కుమారుడు తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు లోనయ్యాడని, ఆ భాదలోనే హార్ట్‌ ఎటాక్‌ వచ్చి చనిపోయాడని వారి కుటుంబీకులు తెలిపారు. మృతుడు వెంకన్నకు భార్య ఇద్దరు కూతుళ్లు ఓ కుమారుడు ఉన్నారు. ఒకే కుటుంబంలో తల్లికొడుకులిద్దరూ ఒకేసారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లి తో పాటే కుమారుడి దహన సంస్కారాలు కూడా ఒకేసారి నిర్వహించారు.