హృదయ విదారకం : కొడుక్కి క‌రోనా ల‌క్ష‌ణాలు..భ‌యంతో త‌ల్లి హఠాన్మరణం

కుమారుడికి కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నాయ‌ని తెలియడంతో అత‌డి తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచింది. మ‌న‌సుల‌ను క‌దిలించే ఈఘటన బాగల్‌కోట జిల్లా జమఖండిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. క‌ర్ణాట‌క‌లోని జమఖండికి చెందిన 47 ఏళ్ల వయస్సు వ్యక్తికి కోవిడ్ సింట‌మ్స్ ఉన్న‌ట్లు శనివారం వైద్యులు నిర్ధారించారు. విషయం అత‌ని తల్లికి చెప్ప‌గానే.. ఇంట్లోనే ఉన్న ఆమె కుప్పకూలింది. హాస్ప‌టల్ కి తరలించగా అప్పటికే ప్రాణాలు విడిచిన‌ట్టు డాక్ట‌ర్లు నిర్ధారించారు. మృతురాలికీ బీపీ, షుగ‌ర్ ఉన్నట్లు వైద్యులు […]

హృదయ విదారకం : కొడుక్కి క‌రోనా ల‌క్ష‌ణాలు..భ‌యంతో త‌ల్లి హఠాన్మరణం
Follow us

|

Updated on: Apr 20, 2020 | 4:07 PM

కుమారుడికి కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నాయ‌ని తెలియడంతో అత‌డి తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచింది. మ‌న‌సుల‌ను క‌దిలించే ఈఘటన బాగల్‌కోట జిల్లా జమఖండిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. క‌ర్ణాట‌క‌లోని జమఖండికి చెందిన 47 ఏళ్ల వయస్సు వ్యక్తికి కోవిడ్ సింట‌మ్స్ ఉన్న‌ట్లు శనివారం వైద్యులు నిర్ధారించారు. విషయం అత‌ని తల్లికి చెప్ప‌గానే.. ఇంట్లోనే ఉన్న ఆమె కుప్పకూలింది. హాస్ప‌టల్ కి తరలించగా అప్పటికే ప్రాణాలు విడిచిన‌ట్టు డాక్ట‌ర్లు నిర్ధారించారు. మృతురాలికీ బీపీ, షుగ‌ర్ ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. మృతురాలికి క‌రోనా నిబంధ‌న‌ల‌ ప్రకారం అంత్యక్రియలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రాజేంద్ర అధికారులను ఆదేశించారు.