దేశవ్యాప్తంగా ఆ జిల్లాల్లోనే వైరస్ వ్యాప్తి అధికం..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలపై ఓ ప్రజా ఆరోగ్య సంస్థ సర్వే చేసింది. బిహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బెంగాల్, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలోని జిల్లాలకు వైరస్ నుంచి అధిక ముప్పు పొంచి ఉందని తేలింది. ఈ ప్రాంతాల్లో వైరస్ రోగులను గుర్తించడం చాలా లేటవుతుందని పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని తూర్పు జిల్లాలు..కర్ణాటకలోని ఉత్తర జిల్లాలు, ఓ మోస్తరుగా వైరస్ బారిన పడే అవకాశముందని సర్వే వెల్లడించింది. హర్యానా, ఉత్తరాఖండ్, […]
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలపై ఓ ప్రజా ఆరోగ్య సంస్థ సర్వే చేసింది. బిహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బెంగాల్, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలోని జిల్లాలకు వైరస్ నుంచి అధిక ముప్పు పొంచి ఉందని తేలింది. ఈ ప్రాంతాల్లో వైరస్ రోగులను గుర్తించడం చాలా లేటవుతుందని పేర్కొంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని తూర్పు జిల్లాలు..కర్ణాటకలోని ఉత్తర జిల్లాలు, ఓ మోస్తరుగా వైరస్ బారిన పడే అవకాశముందని సర్వే వెల్లడించింది. హర్యానా, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్ముకశ్మీర్, కేరళ, హిమాచల్ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోని అధిక జిల్లాల్లో వైరస్ ప్రమాదం తక్కువగా ఉందని అధ్యయనం చేసిన సంస్థ తెలిపింది. అంతర్జాతీయ సర్వేల ప్రకారం..జనాభా, ఆరోగ్యం, సామాజిక-ఆర్థిక పరిస్థితులు, సహా మొత్తం 15 అంశాలు వైరస్ సోకే అవకాశాలు పెంచుతాయి. అధ్యయనం అనంతరం ‘వల్నరెబిలిటీ ఇండెక్స్’ను రూపొందించినట్టు పరిశోధకులు తెలిపారు. ప్రతి జిల్లాలోని వైరస్ కేసులు, అసలు పరిస్థితులను ఈ ఇండెక్స్ చూపుతుందని వెల్లడించారు.